ETV Bharat / bharat

ఎస్సీ అంత్యక్రియలకు అడ్డుపడ్డ అగ్రవర్ణాలు!

శవాలపై కులసాధనలు దేశంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అవును, ఓ ఎస్సీ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు అగ్రకులాలు ఆంక్షలు విధించాయి. గత్యంతరం లేక, 20 అడుగుల ఎత్తు నుంచి తాళ్ల సాయంతో మృత దేహాన్ని కిందకు దింపి దహనం చేసిన హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 22, 2019, 5:36 PM IST

Updated : Sep 27, 2019, 9:41 PM IST

ఎస్సీ అంత్యక్రియలకు అడ్డుపడ్డ అగ్రవర్గాలు!
ఎస్సీ అంత్యక్రియలకు అడ్డుపడ్డ అగ్రవర్గాలు!
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారతదేశంలో కులాల అడ్డుగోడలు మాత్రం ఇంకా పటిష్టంగానే ఉన్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగుచూసింది. మృతుడు ఎస్సీ అయినందుకు శ్మశానానికి వెళ్లేందుకు దారివ్వలేదు అగ్రకులాల పెద్దలు. గతిలేని స్థితిలో మృతదేహాన్ని వంతెనపై నుంచి తాళ్లు కట్టి కిందికి దింపి అంత్యక్రియలు చేశారు.

తమిళనాడు వెల్లూర్​ జిల్లాలోని వానియంపాడి దగ్గర నారాయణపురంలో ఎస్సీలు ఇప్పటికీ అవమానాలు ఎదురుకుంటున్నారు. గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. దహనం చేసేందుకు శ్మశానవాటికకు వెళ్లాలంటే వంతెన దాటాలి, వంతెనకు ఇరువైపులా అగ్రకులాలవారి పొలాలున్నాయి. కానీ అగ్రకులాలవారు ఓ ఎస్సీ శవాన్ని మా పొలాల మీదుగా తీసుకువెళ్లేందుకు వీల్లేదన్నారు.

వారి పొలాలు దాటకుండా శ్మశానానికి వెళ్లేందుకు వేరే మార్గం లేదు. అది తెలిసి కూడా, అగ్రకులాలు ఇలా అడ్డుకోవడం వారి అంహకారానికి అద్దం పట్టింది. వాదోపవాదాల తర్వాత.. మృతదేహాన్ని చాపలో చుట్టి, తాళ్ల సాయంతో20 అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి కిందికి దింపి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్​కు దళితులకు ప్రత్యేక శ్మశాన వాటిక కోరుతూ లేఖ రాశారు.

ఇదీ చూడండి:ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

ఎస్సీ అంత్యక్రియలకు అడ్డుపడ్డ అగ్రవర్గాలు!
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారతదేశంలో కులాల అడ్డుగోడలు మాత్రం ఇంకా పటిష్టంగానే ఉన్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగుచూసింది. మృతుడు ఎస్సీ అయినందుకు శ్మశానానికి వెళ్లేందుకు దారివ్వలేదు అగ్రకులాల పెద్దలు. గతిలేని స్థితిలో మృతదేహాన్ని వంతెనపై నుంచి తాళ్లు కట్టి కిందికి దింపి అంత్యక్రియలు చేశారు.

తమిళనాడు వెల్లూర్​ జిల్లాలోని వానియంపాడి దగ్గర నారాయణపురంలో ఎస్సీలు ఇప్పటికీ అవమానాలు ఎదురుకుంటున్నారు. గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. దహనం చేసేందుకు శ్మశానవాటికకు వెళ్లాలంటే వంతెన దాటాలి, వంతెనకు ఇరువైపులా అగ్రకులాలవారి పొలాలున్నాయి. కానీ అగ్రకులాలవారు ఓ ఎస్సీ శవాన్ని మా పొలాల మీదుగా తీసుకువెళ్లేందుకు వీల్లేదన్నారు.

వారి పొలాలు దాటకుండా శ్మశానానికి వెళ్లేందుకు వేరే మార్గం లేదు. అది తెలిసి కూడా, అగ్రకులాలు ఇలా అడ్డుకోవడం వారి అంహకారానికి అద్దం పట్టింది. వాదోపవాదాల తర్వాత.. మృతదేహాన్ని చాపలో చుట్టి, తాళ్ల సాయంతో20 అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి కిందికి దింపి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్​కు దళితులకు ప్రత్యేక శ్మశాన వాటిక కోరుతూ లేఖ రాశారు.

ఇదీ చూడండి:ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.