ETV Bharat / bharat

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

author img

By

Published : Nov 10, 2019, 3:01 PM IST

Updated : Nov 10, 2019, 6:37 PM IST

బుల్​బుల్ తుపాను భారత్​-బంగ్లాదేశ్​లను వణికిస్తోంది. ​ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, భీకర గాలులతో తీరప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రజలకు అండగా ఉండేందుకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్​బుల్​ తుపాను.. భారత్​-బంగ్లాదేశ్​పై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగర్​ ద్వీపానికి సమీపంలోని భారత్ -​ బంగ్లా సరిహద్దులోని​ మడ అడవుల్లో తీరం దాటింది తుపాను. ఇప్పటికే బంగాల్​, ఒడిశాల్లో ఈదురు గాలులు విజృంభిస్తున్నాయి.

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

భయంకర హరికేన్లకు రెండింతలుగా బుల్​బుల్​ ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బంగాల్​ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల ధాటికి చెట్లు విరిగి పడడం వల్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోతోంది. కొన్ని చోట్ల మనుషుల మీద పడి ప్రాణాలు బలి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బంగాల్​ రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

దీదీకి మోదీ భరోసా..

బంగాల్​లో పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సంభాషించిన ఆయన విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

బంగ్లాను వణికిస్తోన్న తుపాను..

బంగ్లాదేశ్​లో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను బంగ్లా భూభాగంలో ప్రవేశించగానే.. తీరప్రాంతాలు సుమారు 1 నుంచి 2 మీటర్ల మేర మునిగిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

బంగ్లాదేశ్​లో బుల్​బుల్​ తుపాను నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అప్రత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. 5 వేలకుపైగా పాఠశాల భవనాలు, మసీదులను పునరావాస కేంద్రాలుగా వినియోగించనున్నారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 18 లక్షల మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రెహమాన్​ తెలిపారు. కొన్ని గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని లౌడ్​స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు అధికారులు. నౌకాశ్రాయల్లో అన్నీ కార్యకలాపాలను నిలిపివేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:వేగంగా బాబ్రీ కేసు విచారణ... త్వరలో తీర్పు వెలువడే అవకాశం!

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్​బుల్​ తుపాను.. భారత్​-బంగ్లాదేశ్​పై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగర్​ ద్వీపానికి సమీపంలోని భారత్ -​ బంగ్లా సరిహద్దులోని​ మడ అడవుల్లో తీరం దాటింది తుపాను. ఇప్పటికే బంగాల్​, ఒడిశాల్లో ఈదురు గాలులు విజృంభిస్తున్నాయి.

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

భయంకర హరికేన్లకు రెండింతలుగా బుల్​బుల్​ ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బంగాల్​ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల ధాటికి చెట్లు విరిగి పడడం వల్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోతోంది. కొన్ని చోట్ల మనుషుల మీద పడి ప్రాణాలు బలి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బంగాల్​ రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

దీదీకి మోదీ భరోసా..

బంగాల్​లో పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సంభాషించిన ఆయన విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

బంగ్లాను వణికిస్తోన్న తుపాను..

బంగ్లాదేశ్​లో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను బంగ్లా భూభాగంలో ప్రవేశించగానే.. తీరప్రాంతాలు సుమారు 1 నుంచి 2 మీటర్ల మేర మునిగిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

బంగ్లాదేశ్​లో బుల్​బుల్​ తుపాను నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అప్రత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. 5 వేలకుపైగా పాఠశాల భవనాలు, మసీదులను పునరావాస కేంద్రాలుగా వినియోగించనున్నారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 18 లక్షల మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రెహమాన్​ తెలిపారు. కొన్ని గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని లౌడ్​స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు అధికారులు. నౌకాశ్రాయల్లో అన్నీ కార్యకలాపాలను నిలిపివేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:వేగంగా బాబ్రీ కేసు విచారణ... త్వరలో తీర్పు వెలువడే అవకాశం!

AP Video Delivery Log - 0800 GMT News
Sunday, 10 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0739: Japan Emperor No Use after December 9 2019; No Access Japan; Do Not Obscure NHK Logo; For Media Use Only 4239068
Japan's Emperor Naruhito marks enthronement
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 10, 2019, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.