ETV Bharat / bharat

దీపావళి కానుక... 25వేల మంది హోంగార్డులకు ఊరట! - up govt decion on homeguard

యూపీ ప్రభుత్వం హోంగార్డులకు ఊరట కలిగించే ప్రకటన విడుదల చేసింది. విధులనుంచి తొలగించిన 25 వేల మంది సేవలు రాష్ట్రంలో తిరిగి కొనసాగుతాయని హామీ ఇచ్చింది. రాష్ట్ర హోంగార్డ్​ విభాగం వారి వేతనాలు చెల్లిస్తుందని స్పష్టం చేసింది.

దీపావళి కానుక... 25వేల మంది హోంగార్డులకు ఊరట!
author img

By

Published : Oct 24, 2019, 6:16 PM IST


25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. వారి సేవలు రాష్ట్రంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనతో హోంగార్డులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ నెల 15న ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం పోలీస్ ​శాఖకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల దృష్ట్యా ఏకంగా 25 వేల హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది.

అయితే ఇప్పుడు దీపావళి వంటి పండుగ రోజుల్లో సిబ్బంది అవసరముందని భావిస్తోంది ఆ ప్రభుత్వం. అందుకే వైఖరి మార్చుకుంది.
"పండుగ సీజన్​ రానున్న నేపథ్యంలో హోంగార్డుల సేవలు రాష్ట్రంలో అనివార్యమని ఈ నిర్ణయం తీసుకున్నాం."
- అవినేష్​ అవస్తి, యూపీ ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి

హోంగార్డులకు రోజువారీ జీతం రూ.500గా ఉండేది. సుప్రీం ఆదేశాలతో అది రూ.672కు చేరింది.

ఇదీ చూడండి:పోలీసుల బరువు, చుట్టుకొలతల లెక్క తేల్చే పనిలో ఎస్పీ


25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. వారి సేవలు రాష్ట్రంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనతో హోంగార్డులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ నెల 15న ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం పోలీస్ ​శాఖకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల దృష్ట్యా ఏకంగా 25 వేల హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది.

అయితే ఇప్పుడు దీపావళి వంటి పండుగ రోజుల్లో సిబ్బంది అవసరముందని భావిస్తోంది ఆ ప్రభుత్వం. అందుకే వైఖరి మార్చుకుంది.
"పండుగ సీజన్​ రానున్న నేపథ్యంలో హోంగార్డుల సేవలు రాష్ట్రంలో అనివార్యమని ఈ నిర్ణయం తీసుకున్నాం."
- అవినేష్​ అవస్తి, యూపీ ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి

హోంగార్డులకు రోజువారీ జీతం రూ.500గా ఉండేది. సుప్రీం ఆదేశాలతో అది రూ.672కు చేరింది.

ఇదీ చూడండి:పోలీసుల బరువు, చుట్టుకొలతల లెక్క తేల్చే పనిలో ఎస్పీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.