ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆనారోగ్య సమస్యలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల... ఆనందిబెన్కు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు.
85 ఏళ్ల లాల్జీ టాండన్ జూన్ 11 నుంచి లఖ్నవూలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుని వచ్చేంత వరకు మధ్యప్రదేశ్ బాధ్యతలను ఆనందిబెన్ నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'చైనా విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారు?'