ETV Bharat / bharat

ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదముద్ర వేసింది. 147-42 ఓట్ల తేడాతో బిల్లుకు పెద్దలసభ ఆమోదం తెలిపింది. ఎగువ సభలో చర్చ సందర్భంగా.. దేశ రక్షణ కోసం కృషి చేస్తోన్న వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే నాలుగడుగుల ముందుంచడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు హోంమంత్రి అమిత్​షా.

author img

By

Published : Aug 2, 2019, 2:14 PM IST

ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం
ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు- 2019కు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్​లో 147- 42 తేడాతో బిల్లుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. జులై 24న లోక్​సభలో బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే నాలుగు అడుగులు ముందు నిలిపే లక్ష్యంతోనే సవరణలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రతిపాదిత నూతన చట్టం ఏవిధంగానూ దుర్వినియోగం కాదని తేల్చిచెప్పారు. యూపీఏ హయాంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సరైన విధంగా సవరణలు చేస్తే ఇప్పుడు చేయాల్సి వచ్చేది కాదన్నారు షా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చట్టాలు చేయాల్సి ఉంటుందన్నారు

చట్టంగా మారితే...

ఇప్పటివరకూ ఉగ్రవాద సంస్థలపైనే నిషేధం విధించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండేది. నూతన చట్టం ద్వారా తీవ్రవాదులపై వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసే అవకాశం భారత ప్రభుత్వానికి కలుగుతుంది. ఫలితంగా సదరు వ్యక్తి ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. ఇతర దేశాలతో ఆ ఉగ్రవాది పూర్తి వివరాలను భారత్​ పంచుకుంటుంది. బిల్లు చట్టంగా మారగానే మొదటిగా పఠాన్​కోట్​, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారులు మసూద్​ అజార్​, హఫీజ్​ సయీద్​లపై ఉగ్రవాద ముద్ర వేస్తామని కేంద్ర హోంశాఖ అధికార వర్గం ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే వీళ్లే మొదటి లక్ష్యం

ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు- 2019కు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్​లో 147- 42 తేడాతో బిల్లుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. జులై 24న లోక్​సభలో బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే నాలుగు అడుగులు ముందు నిలిపే లక్ష్యంతోనే సవరణలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రతిపాదిత నూతన చట్టం ఏవిధంగానూ దుర్వినియోగం కాదని తేల్చిచెప్పారు. యూపీఏ హయాంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సరైన విధంగా సవరణలు చేస్తే ఇప్పుడు చేయాల్సి వచ్చేది కాదన్నారు షా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చట్టాలు చేయాల్సి ఉంటుందన్నారు

చట్టంగా మారితే...

ఇప్పటివరకూ ఉగ్రవాద సంస్థలపైనే నిషేధం విధించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండేది. నూతన చట్టం ద్వారా తీవ్రవాదులపై వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసే అవకాశం భారత ప్రభుత్వానికి కలుగుతుంది. ఫలితంగా సదరు వ్యక్తి ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. ఇతర దేశాలతో ఆ ఉగ్రవాది పూర్తి వివరాలను భారత్​ పంచుకుంటుంది. బిల్లు చట్టంగా మారగానే మొదటిగా పఠాన్​కోట్​, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారులు మసూద్​ అజార్​, హఫీజ్​ సయీద్​లపై ఉగ్రవాద ముద్ర వేస్తామని కేంద్ర హోంశాఖ అధికార వర్గం ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే వీళ్లే మొదటి లక్ష్యం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASEAN HOST BROADCAST – AP CLIENTS ONLY
Bangkok – 2 August 2019
1. Various of foreign ministers at a group photo session for the start of the East Asia Summit
2. Mid of meeting chairman, Thai Foreign Minister Don Pramudwinai, speaking
3. Wide of meeting
4. SOUNDBITE (English) Don Pramudwinai, Thai Foreign Minister:
"We fully support the EAS (East Asia Summit) in playing its constructive role as the premier leaders' platform for dialogue and cooperation on broad strategic, political and economic issues of common concern and interest. Our goal remains promoting peace, stability and economic prosperity in East Asia for the benefits of this region's people."
5. Wide pan of meeting
STORYLINE:
Foreign Ministers from the ten ASEAN nations and their key dialogue and strategic partners met in Bangkok Friday for the start of the East Asia Summit (EAS).
The meeting was held on the sidelines of the annual Association of Southeast Asian Nations (ASEAN) summit.
Meeting chairman, Thai Foreign Minister Don Pramudwinai, said the group's goal is "peace, stability and economic prosperity in East Asia."
US Secretary of State Mike Pompeo and China's Wang Yi were also in attendance.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.