ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ ఐటీ దాడుల్లో రూ.281 కోట్లు స్వాధీనం

మధ్యప్రదేశ్​లో ఐటీశాఖ దాడుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్​నాథ్​ అనుచరులకు చెందిన రూ.14.6 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మొత్తం రూ. 281 కోట్లను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Apr 9, 2019, 6:16 AM IST

కమల్​నాథ్​ అనుచరులపై ఐటీశాఖ దాడులు
మధ్యప్రదేశ్​ ఐటీ దాడుల్లో రూ.281 కోట్లు స్వాధీనం

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ అనుచరులకు చెందిన రూ. 14.6 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో 252 విదేశీ మద్యం సీసాలు, నగదు లావాదేవీల సమాచారమున్న కొంత మంది డైరీలు, హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మొత్తం రూ. 281 కోట్లను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

దిల్లీలోనూ తనిఖీలు

దిల్లీలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల నగదునూ జప్తు చేశారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అధికారులు. ఓ ప్రముఖ పార్టీ కార్యాలయానికి కార్యకర్త నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్యకర్త బంధువుల ఇళ్లలో జరిపిన తనిఖీలతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముందన్నారు.

రూ.230 కోట్ల అక్రమ లావాదేవీల సమాచారమున్న పుస్తకాన్ని, మరో రూ.242 కోట్ల బిల్లింగ్స్​ను, పన్ను ఎగవేతకు పాల్పడిన 80 కంపెనీల ఆధారాల గుర్తించారు ఐటీ అధికారులు.
ఎన్నికల నియమావళికి విరుద్ధమైన ఇలాంటి చర్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐటీశాఖ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్​ ఐటీ దాడుల్లో రూ.281 కోట్లు స్వాధీనం

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ అనుచరులకు చెందిన రూ. 14.6 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో 252 విదేశీ మద్యం సీసాలు, నగదు లావాదేవీల సమాచారమున్న కొంత మంది డైరీలు, హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మొత్తం రూ. 281 కోట్లను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

దిల్లీలోనూ తనిఖీలు

దిల్లీలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల నగదునూ జప్తు చేశారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అధికారులు. ఓ ప్రముఖ పార్టీ కార్యాలయానికి కార్యకర్త నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్యకర్త బంధువుల ఇళ్లలో జరిపిన తనిఖీలతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముందన్నారు.

రూ.230 కోట్ల అక్రమ లావాదేవీల సమాచారమున్న పుస్తకాన్ని, మరో రూ.242 కోట్ల బిల్లింగ్స్​ను, పన్ను ఎగవేతకు పాల్పడిన 80 కంపెనీల ఆధారాల గుర్తించారు ఐటీ అధికారులు.
ఎన్నికల నియమావళికి విరుద్ధమైన ఇలాంటి చర్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐటీశాఖ అధికారులు తెలిపారు.

New Delhi, Apr 08 (ANI): Shah Rukh Khan proved yet again that he is not just 'the king of romance' but also the 'badshah of wit' who can leave his fans amused like no other star in Bollywood. On Monday, Abhishek Bachchan posted a motivational quote on Twitter that read 'To be the best you have to work overtime'. Khan responded to Bachchan's tweet in a fun reply, saying "Thanks baby. Got this. Now please motivate me to work on Time too!!" SRK often uses his Twitter account to reply to questions from his fans, using the hashtag #AskSRK, where the actor is known to come up with hilarious responses even to people who try to troll him. On the work front, while Khan was last seen in the 2018 release 'Zero', junior Bachchan's last movie was 'Manmarziyaan' that released in September last year.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.