ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Apr 29, 2020, 9:32 AM IST

Updated : Apr 29, 2020, 12:17 PM IST

నియంత్రణ రేఖ వెంబడి విరుచుకుపడుతున్న ఉగ్రవాదులకు భారత్​ దీటుగా బదులిస్తోంది. ముష్కరుల్ని ఏరిపారేస్తోంది సైన్యం. జమ్ముకశ్మీర్ షోపియాన్​లో మంగళవారం నుంచి జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

two militant killed in encounter with security forces in J&K's Shopian
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. జైన్​పొరాలోని మెల్హోరా వద్ద మంగళవారం నిర్బంధ తనిఖీలు చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు ముష్కరులు. ప్రతిఘటించిన బలగాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నిన్న సాయంత్రం ఒకరు చనిపోగా.. ఇవాళ మరో ఇద్దరని హతమార్చింది.

ముష్కరుల కోసం భద్రతా దళాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. జైన్​పొరాలోని మెల్హోరా వద్ద మంగళవారం నిర్బంధ తనిఖీలు చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు ముష్కరులు. ప్రతిఘటించిన బలగాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నిన్న సాయంత్రం ఒకరు చనిపోగా.. ఇవాళ మరో ఇద్దరని హతమార్చింది.

ముష్కరుల కోసం భద్రతా దళాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Apr 29, 2020, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.