ETV Bharat / bharat

భారత్​లో కరోనా కలకలం- మరో రెండు కేసులు

author img

By

Published : Mar 2, 2020, 5:01 PM IST

Updated : Mar 3, 2020, 4:27 AM IST

కరోనా వైరస్​పై భారత్​ విజయం సాధించిందనుకున్న తరుణంలో.. కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేరళకే పరిమితమైన వైరస్​ కేసులు.. తాజాగా దిల్లీతో పాటు తెలంగాణలోనూ నమోదయ్యాయి. ఇటలీ, దుబాయి నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్​ సోకినట్టు గుర్తించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. వారికి ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తోంది.

Two fresh cases of coronavirus detected in India
భారత్​లో మరో రెండు కరోనా కేసులు
భారత్​లో కరోనా కలకలం

భారత్​లో మరోమారు కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. తాజాగా ఇద్దరికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ కావడం వల్ల దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5కు చేరింది.

మొదటి మూడు కేసులు కేరళకు చెందినవి కాగా... తాజా కేసులు దేశ రాజధాని దిల్లీ, తెలంగాణలో నమోదయ్యాయి. ఇటలీ నుంచి దిల్లీకి వచ్చిన వ్యక్తితో పాటు.. దుబాయ్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తికీ వైరస్​ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీ వ్యక్తికి స్థానిక ఆర్​ఎంఎల్​ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది.

ఈ పూర్తి వ్యవహారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్​ స్పందించారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

"దిల్లీ, తెలంగాణలో 2 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వారు ఇటలీ, దుబాయి నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు భారత్​లో మొత్తం 5 కేసులు నిర్ధరణ అయ్యాయి. 21 విమానాశ్రయాలు, 77 చిన్న, ప్రధాన నౌకాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్​ పరీక్షలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 5,57,431 మంది, నౌకాశ్రయాల్లో 12,431 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించాం."


- డా. హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.

మరిన్ని దేశాలపై ఆంక్షలు

తాజా కేసుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి. ప్రయాణ మార్గదర్శకాల్లో భాగంగా చైనా, ఇరాన్​ దేశాలకు ఈ-వీసాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. చైనా, ఇరాన్​, కొరియా, సింగపూర్​, ఇటలీ దేశాలకు అత్యవసరమైతే తప్పా ప్రయాణించవద్దని సూచించారు.

89వేల కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 89 వేల మందికి కరోనా సోకగా.. ఒక్క చైనాలోనే 80,026 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు

భారత్​లో కరోనా కలకలం

భారత్​లో మరోమారు కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. తాజాగా ఇద్దరికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ కావడం వల్ల దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5కు చేరింది.

మొదటి మూడు కేసులు కేరళకు చెందినవి కాగా... తాజా కేసులు దేశ రాజధాని దిల్లీ, తెలంగాణలో నమోదయ్యాయి. ఇటలీ నుంచి దిల్లీకి వచ్చిన వ్యక్తితో పాటు.. దుబాయ్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తికీ వైరస్​ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీ వ్యక్తికి స్థానిక ఆర్​ఎంఎల్​ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది.

ఈ పూర్తి వ్యవహారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్​ స్పందించారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

"దిల్లీ, తెలంగాణలో 2 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వారు ఇటలీ, దుబాయి నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు భారత్​లో మొత్తం 5 కేసులు నిర్ధరణ అయ్యాయి. 21 విమానాశ్రయాలు, 77 చిన్న, ప్రధాన నౌకాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్​ పరీక్షలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 5,57,431 మంది, నౌకాశ్రయాల్లో 12,431 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించాం."


- డా. హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.

మరిన్ని దేశాలపై ఆంక్షలు

తాజా కేసుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి. ప్రయాణ మార్గదర్శకాల్లో భాగంగా చైనా, ఇరాన్​ దేశాలకు ఈ-వీసాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. చైనా, ఇరాన్​, కొరియా, సింగపూర్​, ఇటలీ దేశాలకు అత్యవసరమైతే తప్పా ప్రయాణించవద్దని సూచించారు.

89వేల కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 89 వేల మందికి కరోనా సోకగా.. ఒక్క చైనాలోనే 80,026 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు

Last Updated : Mar 3, 2020, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.