ETV Bharat / bharat

నిర్బంధ కేంద్రం నుంచి పారిపోయిన ఖైదీలు

కరోనా నిర్బంధ కేంద్రం నుంచి పాజిటివ్​గా తేలిన ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటన మహారాష్ట్ర ఔరంగాబాద్​లో జరిగింది. వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Jun 8, 2020, 10:30 PM IST

Two coronavirus +ve prisoners escape from COVID care centre
నిర్బంధ కేంద్రం నుంచి పారిపోయిన ఖైదీలు

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని నిర్బంధ కేంద్రం నుంచి కరోనా పాజిటివ్​గా తేలిన ఇద్దరు ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెడ్​షీట్లను తాడుగా మలచి, గది కిటికీ చువ్వలను వంచి ఆదివారం రాత్రి పారిపోయినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బేగంపుర పోలీసులు ఓ జైలు ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పారిపోయిన ఖైదీలను వెతికి పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు జైలు అధికారులు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం విచారణలో ఉన్న 29మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా తెలిన నేపథ్యంలో వారిని కిలార్క్​ కొవిడ్​ కేర్​ కేంద్రానికి పంపించారు.

ఇదీ చూడండి:ఉత్తర్‌ప్రదేశ్​ సర్కారుకు 'పాక్'‌ అభినందనలు

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని నిర్బంధ కేంద్రం నుంచి కరోనా పాజిటివ్​గా తేలిన ఇద్దరు ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెడ్​షీట్లను తాడుగా మలచి, గది కిటికీ చువ్వలను వంచి ఆదివారం రాత్రి పారిపోయినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బేగంపుర పోలీసులు ఓ జైలు ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పారిపోయిన ఖైదీలను వెతికి పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు జైలు అధికారులు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం విచారణలో ఉన్న 29మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా తెలిన నేపథ్యంలో వారిని కిలార్క్​ కొవిడ్​ కేర్​ కేంద్రానికి పంపించారు.

ఇదీ చూడండి:ఉత్తర్‌ప్రదేశ్​ సర్కారుకు 'పాక్'‌ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.