ETV Bharat / bharat

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు! - two agents allegedly chopped off fingers and toes of a migrant labourer

చేసిన పనికి వేతనం అడిగిన పాపానికి ఓ శ్రామికుడి వేళ్లు తెగ్గోశారు. కష్టపడి పనిచేసి.. కూలీ డబ్బులు అడిగినందుకు.. ఎప్పటికీ పనిచేయకుండా చేశారు. మహారాష్ట్ర నాగపుర్​లో జరిగిందీ దారుణం.

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు!
author img

By

Published : Oct 6, 2019, 10:31 AM IST

Updated : Oct 6, 2019, 11:57 AM IST

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు!

స్వరాష్ట్రంలో బతుకు భారమని ఏజెంట్లను నమ్మి మరో ప్రాంతానికి వెళ్లాడు ఆ శ్రామికుడు. చేసిన కష్టానికి వేతనం ఇవ్వాలని అడిగినందుకు చేతులు, కాళ్ల వేళ్లు నరికేశారు ఆ ఏజెంట్లు.

ఒడిశా నువాపాడా జిల్లాలోని తికిరపాడా గ్రామానికి చెందిన చమరు పహారియా దళారుల సాయంతో పనికోసం నాగపుర్​కు వెళ్లాడు. ఓ భవన నిర్మాణంలో కూలీగా పహారియాను పనికి కుదుర్చుకున్నారు. తాను చేసిన పనికి డబ్బు అడిగాడు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీ.

డబ్బులు అడిగాడని సత్నామీ, సునానీ అనే ఇద్దరు దళారులు పహారియాపై కక్ష పెంచుకున్నారు. మద్యం తాగించి కుడిచేతికి ఉన్న మూడు వేళ్లను, కాలికి ఉన్న ఐదు వేళ్లను నరికేశారు. అనంతరం నాగపుర్ రైల్వేస్టేషన్​లో వదిలేశారు. పహారియాను రక్షించిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత స్వగ్రామానికి పంపించారు.

"సత్నామి, సునానీ కొన్ని నెలల కిందట నన్ను నాగపుర్​కు తీసుకెళ్లారు. నేను డబ్బడిగితే నాపై దాడి చేసి నా వేళ్లు నరికేశారు."

-చమరు పహారియా, రోజు కూలీ

కుటుంబ సభ్యులు స్థానిక కొమ్నా పోలీస్ స్టేషన్​లో ఘటనపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు!

స్వరాష్ట్రంలో బతుకు భారమని ఏజెంట్లను నమ్మి మరో ప్రాంతానికి వెళ్లాడు ఆ శ్రామికుడు. చేసిన కష్టానికి వేతనం ఇవ్వాలని అడిగినందుకు చేతులు, కాళ్ల వేళ్లు నరికేశారు ఆ ఏజెంట్లు.

ఒడిశా నువాపాడా జిల్లాలోని తికిరపాడా గ్రామానికి చెందిన చమరు పహారియా దళారుల సాయంతో పనికోసం నాగపుర్​కు వెళ్లాడు. ఓ భవన నిర్మాణంలో కూలీగా పహారియాను పనికి కుదుర్చుకున్నారు. తాను చేసిన పనికి డబ్బు అడిగాడు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీ.

డబ్బులు అడిగాడని సత్నామీ, సునానీ అనే ఇద్దరు దళారులు పహారియాపై కక్ష పెంచుకున్నారు. మద్యం తాగించి కుడిచేతికి ఉన్న మూడు వేళ్లను, కాలికి ఉన్న ఐదు వేళ్లను నరికేశారు. అనంతరం నాగపుర్ రైల్వేస్టేషన్​లో వదిలేశారు. పహారియాను రక్షించిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత స్వగ్రామానికి పంపించారు.

"సత్నామి, సునానీ కొన్ని నెలల కిందట నన్ను నాగపుర్​కు తీసుకెళ్లారు. నేను డబ్బడిగితే నాపై దాడి చేసి నా వేళ్లు నరికేశారు."

-చమరు పహారియా, రోజు కూలీ

కుటుంబ సభ్యులు స్థానిక కొమ్నా పోలీస్ స్టేషన్​లో ఘటనపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

New Delhi, Oct 06 (ANI): Taapsee Pannu of 'Saand Ki Aankh' met Vice President Venkaiah Naidu on October 05. Taapsee Pannu along with Chandro Tomar and Prakashi Tomar went to meet the Vice President. The film is based on the life of two sharpshooters- Chandro Tomar and Prakashi Tomar. Screening of the film was held for the first time for Vice President Naidu. Speaking to mediapersons, Taapsee shared the storyline of the movie and her inspiration. The film is set to release this Diwali.
Last Updated : Oct 6, 2019, 11:57 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.