స్వరాష్ట్రంలో బతుకు భారమని ఏజెంట్లను నమ్మి మరో ప్రాంతానికి వెళ్లాడు ఆ శ్రామికుడు. చేసిన కష్టానికి వేతనం ఇవ్వాలని అడిగినందుకు చేతులు, కాళ్ల వేళ్లు నరికేశారు ఆ ఏజెంట్లు.
ఒడిశా నువాపాడా జిల్లాలోని తికిరపాడా గ్రామానికి చెందిన చమరు పహారియా దళారుల సాయంతో పనికోసం నాగపుర్కు వెళ్లాడు. ఓ భవన నిర్మాణంలో కూలీగా పహారియాను పనికి కుదుర్చుకున్నారు. తాను చేసిన పనికి డబ్బు అడిగాడు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీ.
డబ్బులు అడిగాడని సత్నామీ, సునానీ అనే ఇద్దరు దళారులు పహారియాపై కక్ష పెంచుకున్నారు. మద్యం తాగించి కుడిచేతికి ఉన్న మూడు వేళ్లను, కాలికి ఉన్న ఐదు వేళ్లను నరికేశారు. అనంతరం నాగపుర్ రైల్వేస్టేషన్లో వదిలేశారు. పహారియాను రక్షించిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత స్వగ్రామానికి పంపించారు.
"సత్నామి, సునానీ కొన్ని నెలల కిందట నన్ను నాగపుర్కు తీసుకెళ్లారు. నేను డబ్బడిగితే నాపై దాడి చేసి నా వేళ్లు నరికేశారు."
-చమరు పహారియా, రోజు కూలీ
కుటుంబ సభ్యులు స్థానిక కొమ్నా పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్లో చికిత్స