ETV Bharat / bharat

పాక్ ప్రధానిది అసత్య ప్రచారం: విదేశాంగ శాఖ

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ భారత్​పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. బంగ్లాదేశ్​లో జరిగిన ఓ పోలీస్ ఘటనను ఉత్తర్​ప్రదేశ్ పోలీసులకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్​పై అభ్యంతరం వ్యక్తం చేసింది.

author img

By

Published : Jan 4, 2020, 6:53 AM IST

Updated : Jan 4, 2020, 7:23 AM IST

imran khan
పాక్ ప్రధానిది అసత్య ప్రచారం: విదేశాంగ శాఖ

పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ చేసిన ట్వీట్​పై దీటుగా స్పందించింది భారత్. ట్విట్టర్​లో ఉత్తర్​ప్రదేశ్ పోలీసులను ఉటంకిస్తూ ఇమ్రాన్​... ఓ వీడియో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్​కు వ్యతిరేకంగా పాక్​ ప్రధాని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ముస్లింలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలుగా పేర్కొంటూ.. ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు ఇమ్రాన్. అయితే అది బంగ్లాదేశ్​కు సంబంధించిన వీడియోగా తేలింది. ఈ నేపథ్యంలో భారత్​కు వ్యతిరేక పోస్టుపై ట్విట్టర్ అధికారులు ఇమ్రాన్​ను వారించారు. అనంతరం ఆయన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తొలగించారు.

"ఇమ్రాన్ ట్విట్టర్​ పోస్ట్ తప్పుడు వార్త అని గుర్తించాం. ట్విట్టర్​కు నివేదించాం. ఇమ్రాన్ తన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తర్వాత తొలగించారు."

- రవీశ్​కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇమ్రాన్ ట్వీట్ వ్యవహారంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. ఏడేళ్ల నాటి బంగ్లా వీడియోను పోస్ట్ చేసి భారత్​పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాక్ తన పాత విధానాలను మార్చుకోలేదని వ్యాఖ్యానించారు.

తమ పోలీస్ శాఖ పైన పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది ఉత్తర్​ప్రదేశ్ పోలీసు విభాగం. పాక్ ప్రధాని ట్వీట్ తమ రాష్ట్రానికి చెందినది కాదని తమ అధికారిక బ్లాగ్​లో రాసుకొచ్చింది.

"ఇది యూపీకి చెందినది కాదు. 2013 మేలో బంగ్లాదేశ్​లోని ఢాకాలో జరిగిన ఘటన."

-ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్ విభాగం వివరణ

ఇదీ చూడండి: 'పౌర' రగడ: 'కాంగ్రెస్​.. శరణార్థులపై నాటి మాట ఏమైంది?'

పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ చేసిన ట్వీట్​పై దీటుగా స్పందించింది భారత్. ట్విట్టర్​లో ఉత్తర్​ప్రదేశ్ పోలీసులను ఉటంకిస్తూ ఇమ్రాన్​... ఓ వీడియో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్​కు వ్యతిరేకంగా పాక్​ ప్రధాని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ముస్లింలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలుగా పేర్కొంటూ.. ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు ఇమ్రాన్. అయితే అది బంగ్లాదేశ్​కు సంబంధించిన వీడియోగా తేలింది. ఈ నేపథ్యంలో భారత్​కు వ్యతిరేక పోస్టుపై ట్విట్టర్ అధికారులు ఇమ్రాన్​ను వారించారు. అనంతరం ఆయన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తొలగించారు.

"ఇమ్రాన్ ట్విట్టర్​ పోస్ట్ తప్పుడు వార్త అని గుర్తించాం. ట్విట్టర్​కు నివేదించాం. ఇమ్రాన్ తన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తర్వాత తొలగించారు."

- రవీశ్​కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇమ్రాన్ ట్వీట్ వ్యవహారంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. ఏడేళ్ల నాటి బంగ్లా వీడియోను పోస్ట్ చేసి భారత్​పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాక్ తన పాత విధానాలను మార్చుకోలేదని వ్యాఖ్యానించారు.

తమ పోలీస్ శాఖ పైన పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది ఉత్తర్​ప్రదేశ్ పోలీసు విభాగం. పాక్ ప్రధాని ట్వీట్ తమ రాష్ట్రానికి చెందినది కాదని తమ అధికారిక బ్లాగ్​లో రాసుకొచ్చింది.

"ఇది యూపీకి చెందినది కాదు. 2013 మేలో బంగ్లాదేశ్​లోని ఢాకాలో జరిగిన ఘటన."

-ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్ విభాగం వివరణ

ఇదీ చూడండి: 'పౌర' రగడ: 'కాంగ్రెస్​.. శరణార్థులపై నాటి మాట ఏమైంది?'

Bagdogra (West Bengal), Jan 03 (ANI): Army officials, family members and others paid tribute to Rifleman Arjun Thapa Magar in Bagdogra on January 03. Magar hailed from Nepal. He lost his life during a cordon and search operation in Nowshera sector on 1st January, 2020.
Last Updated : Jan 4, 2020, 7:23 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.