ETV Bharat / bharat

మహారాష్ట్రలో 18వేలు దాటిన మృతులు

author img

By

Published : Aug 10, 2020, 9:38 PM IST

కరోనా రక్కసి దేశంలో కోరలు చాస్తోంది. రోజురోజుకూ రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 9,181 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 293 మంది వైరస్​ కారణంగా మరణించారు. తమిళనాడులో 5,914 మంది మహమ్మారి బారినపడగా.. మరో 114 మంది మృతి చెందారు.

TODAY CORONAVIRUS UPDATES IN INDIA
మహారాష్ట్రలో 18వేలు దాటిన మృతులు.. తమిళనాట తగ్గని వైరస్​

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 9,181 కొత్త కేసులు బయపడ్డాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5,24,513కు చేరింది. కొవిడ్​ ధాటికి మరో 293 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 18,050కు పెరిగింది.

వైరస్​ నుంచి కోలుకొని కొత్తగా 6,711 మంది డిశ్చార్జ్​ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,58,421కు చేరింది. మరో 1,47,735 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తమిళనాట 3లక్షల కేసులు, 5వేల మరణాలు..

తమిళనాడులో వైరస్​ కేసులు అధికమవుతూనే ఉన్నాయి. తాజాగా 5,914 మందికి కొవిడ్​ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,02,815 కు ఎగబాకింది. కరోనాతో కొత్తగా 114 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,041 కు పెరిగింది.

ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,44,675 మంది వైరస్​ను జయించగా.. 53,099 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్ణాటకలో కరోనా కొనసాగుతోందిలా..

కన్నడ నాట కొత్తగా 4,267 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,82,354 కు పెరిగింది. కరోనా కారణంగా మరో 114 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,267 కు చేరింది. ఇప్పటివరకు 99,126 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దిల్లీలో అలా..

దేశ రాజధాని దిల్లీలో తాజాగా 707 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 1,46,134 కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 20 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 4,131కు పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు 1,31,657 మందికి వైరస్​ నయమైందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

యూపీలో కొత్తగా 4,113 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 1,25,722కు పెరిగింది. మహమ్మారి కారణంగా మరో 51 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 2,120 కు చేరింది. వైరస్​ను జయించి 76,724 మంది డిశ్చార్జ్​ అవ్వగా.. మరో 47,878 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

గుజరాత్​లో మరో వెయ్యికిపైగా..

గుజరాత్​లో కొత్తగా 1,056 మందికి వైరస్​ సోకిగా.. మొత్తం బాధితుల సంఖ్య 72,120కు చేరింది. మరో 20 మంది మృతితో.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,674కు పెరిగింది. మరో 1,138 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 55,276 కు పెరిగింది. మరో 14,170 మంది చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 9,181 కొత్త కేసులు బయపడ్డాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5,24,513కు చేరింది. కొవిడ్​ ధాటికి మరో 293 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 18,050కు పెరిగింది.

వైరస్​ నుంచి కోలుకొని కొత్తగా 6,711 మంది డిశ్చార్జ్​ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,58,421కు చేరింది. మరో 1,47,735 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తమిళనాట 3లక్షల కేసులు, 5వేల మరణాలు..

తమిళనాడులో వైరస్​ కేసులు అధికమవుతూనే ఉన్నాయి. తాజాగా 5,914 మందికి కొవిడ్​ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,02,815 కు ఎగబాకింది. కరోనాతో కొత్తగా 114 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,041 కు పెరిగింది.

ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,44,675 మంది వైరస్​ను జయించగా.. 53,099 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్ణాటకలో కరోనా కొనసాగుతోందిలా..

కన్నడ నాట కొత్తగా 4,267 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,82,354 కు పెరిగింది. కరోనా కారణంగా మరో 114 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,267 కు చేరింది. ఇప్పటివరకు 99,126 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దిల్లీలో అలా..

దేశ రాజధాని దిల్లీలో తాజాగా 707 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 1,46,134 కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 20 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 4,131కు పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు 1,31,657 మందికి వైరస్​ నయమైందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

యూపీలో కొత్తగా 4,113 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 1,25,722కు పెరిగింది. మహమ్మారి కారణంగా మరో 51 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 2,120 కు చేరింది. వైరస్​ను జయించి 76,724 మంది డిశ్చార్జ్​ అవ్వగా.. మరో 47,878 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

గుజరాత్​లో మరో వెయ్యికిపైగా..

గుజరాత్​లో కొత్తగా 1,056 మందికి వైరస్​ సోకిగా.. మొత్తం బాధితుల సంఖ్య 72,120కు చేరింది. మరో 20 మంది మృతితో.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,674కు పెరిగింది. మరో 1,138 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 55,276 కు పెరిగింది. మరో 14,170 మంది చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.