ETV Bharat / bharat

కొడుకుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. ఆత్మహత్య - కర్ణాటకలో వ్యక్తి ఆత్మహత్య

కొడుకుపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్​కు వచ్చిన ఓ తండ్రి అదే ఠాణా​ ముందు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. కుమారుడితో నిత్యం ఘర్షణ పడుతున్న తండ్రి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

karnataka man suicide
కొడుకుపై కేసు పెడదామని వచ్చి.. అనంతలోకాలకు..
author img

By

Published : Jan 9, 2021, 5:44 AM IST

కర్ణాటకలోని బీదర్​లో సొంత కుమారుడిపై కేసు పెట్టేందుకు వచ్చిన ఓ తండ్రి పోలీసు స్టేషన్ ముందు ఉన్న చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు వేధింపులకు గురిచేస్తున్నాడని శుక్రవారం ఫిర్యాదు చేయటానికి శరణప్ప అనే వ్యక్తి వెళ్లాడు. అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోయారు.

బీదర్​ జిల్లాలోని హుమనాబాద్ తాలూకా హల్లిఖేడ్ గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా కొడుకుతో గొడవ పడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం చేశారని.. అందుకే శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబం ఆరోపించింది.

ఇదీ చదవండి: తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి.. ఇనుప రాడ్​తో కొట్టి..

కర్ణాటకలోని బీదర్​లో సొంత కుమారుడిపై కేసు పెట్టేందుకు వచ్చిన ఓ తండ్రి పోలీసు స్టేషన్ ముందు ఉన్న చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు వేధింపులకు గురిచేస్తున్నాడని శుక్రవారం ఫిర్యాదు చేయటానికి శరణప్ప అనే వ్యక్తి వెళ్లాడు. అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోయారు.

బీదర్​ జిల్లాలోని హుమనాబాద్ తాలూకా హల్లిఖేడ్ గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా కొడుకుతో గొడవ పడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం చేశారని.. అందుకే శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబం ఆరోపించింది.

ఇదీ చదవండి: తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి.. ఇనుప రాడ్​తో కొట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.