ETV Bharat / bharat

చెన్నైలో కారు బీభత్సం- మద్యం మత్తుకు ఇద్దరు బలి

తమిళనాడు చెన్నైలోని విల్లివక్కమ్​లో ఓ కారు సృష్టించిన బీభత్సానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

author img

By

Published : May 3, 2019, 8:40 PM IST

చెన్నైలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి
చెన్నైలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

తమిళనాడు చెన్నెలోని విల్లివక్కమ్​ ప్రాంతంలో ఇన్నోవా కారు బిభత్సం సృష్టించింది. ముగ్గురిపైకి దూసుకెళ్లి స్థానికులను భయానికి గురిచేసింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

మృతులు సరస(60), మోహన్​(47)లుగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఆది లక్ష్మీ(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి కారణమైన కారును స్థానికులు వెంబడించారు. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పించుకుని పారిపోగా.. డ్రైవర్​ దేవేద్రన్​ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దేవేద్రన్​ అతిగా మద్యం చేవించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి: "అమేఠీ ప్రజలకు రాహుల్​ భావోద్వేగ లేఖ"

చెన్నైలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

తమిళనాడు చెన్నెలోని విల్లివక్కమ్​ ప్రాంతంలో ఇన్నోవా కారు బిభత్సం సృష్టించింది. ముగ్గురిపైకి దూసుకెళ్లి స్థానికులను భయానికి గురిచేసింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

మృతులు సరస(60), మోహన్​(47)లుగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఆది లక్ష్మీ(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి కారణమైన కారును స్థానికులు వెంబడించారు. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పించుకుని పారిపోగా.. డ్రైవర్​ దేవేద్రన్​ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దేవేద్రన్​ అతిగా మద్యం చేవించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి: "అమేఠీ ప్రజలకు రాహుల్​ భావోద్వేగ లేఖ"

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.