ETV Bharat / bharat

అసోం- మిజోరం సరిహద్దు ప్రజల మధ్య ఘర్షణ

author img

By

Published : Oct 19, 2020, 5:07 AM IST

వెదురు చెట్లను నరికే విషయంలో అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు పలు గుడిసెలకు నిప్పంటించారు. సరిహద్దు ప్రజలు పరస్పరం దాడులు చేసుకోగా పలువురు గాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

Assam-Mizoram borde
అసోం- మిజోరం

అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు. మిజోరంలోని కొలాసిబ్, అసోంలోని కాచర్​ జిల్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్, మిజోరం సీఎం జోరామ్​థంగా ఫోన్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు అంగీకరించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

ఫోన్​ సంభాషణ..

ఈ విషయమై ప్రధాని, కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సోనోవాల్ తెలిపారు.

"అసోం, మిజోరం సరిహద్దు వద్ద జరిగిన ఘటనపై జోరామ్​థంగాతో ఫోన్​లో సంభాషించాను. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఇరువురమూ అంగీకరించాం. రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని కేంద్రానికి విన్నవించాం."

- సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి

అల్లర్ల నేపథ్యంలో అసోం, మిజోరం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఇవాళ సమావేశం కానున్నారు.

సరిహద్దు ఉద్రిక్తతలపై తక్షణం స్పందించినందుకు సోనోవాల్​కు జోరామ్​థంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఏం జరిగింది?

వెదురు చెట్లను నరికే విషయంలో అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. మిజోరంలోని కొలైసిబ్‌జిల్లా, అసోంలోని కాచర్‌జిల్లాలోని సరిహద్దుల్లో ఈ ఘర్షణలు తలెత్తాయి. ఆందోళనకారులు పలు గుడిసెలకు నిప్పంటించారు. ఇరు రాష్ట్ర వాసులు పరస్పరం దాడులు చేసుకోగా పలువురు గాయపడ్డారు.

ఘర్షణలను అదుపు చేసేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సరిహద్దుల్లో భారీగా మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

ఇదీ చూడండి: గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు. మిజోరంలోని కొలాసిబ్, అసోంలోని కాచర్​ జిల్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్, మిజోరం సీఎం జోరామ్​థంగా ఫోన్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు అంగీకరించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

ఫోన్​ సంభాషణ..

ఈ విషయమై ప్రధాని, కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సోనోవాల్ తెలిపారు.

"అసోం, మిజోరం సరిహద్దు వద్ద జరిగిన ఘటనపై జోరామ్​థంగాతో ఫోన్​లో సంభాషించాను. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఇరువురమూ అంగీకరించాం. రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని కేంద్రానికి విన్నవించాం."

- సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి

అల్లర్ల నేపథ్యంలో అసోం, మిజోరం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఇవాళ సమావేశం కానున్నారు.

సరిహద్దు ఉద్రిక్తతలపై తక్షణం స్పందించినందుకు సోనోవాల్​కు జోరామ్​థంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఏం జరిగింది?

వెదురు చెట్లను నరికే విషయంలో అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. మిజోరంలోని కొలైసిబ్‌జిల్లా, అసోంలోని కాచర్‌జిల్లాలోని సరిహద్దుల్లో ఈ ఘర్షణలు తలెత్తాయి. ఆందోళనకారులు పలు గుడిసెలకు నిప్పంటించారు. ఇరు రాష్ట్ర వాసులు పరస్పరం దాడులు చేసుకోగా పలువురు గాయపడ్డారు.

ఘర్షణలను అదుపు చేసేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సరిహద్దుల్లో భారీగా మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

ఇదీ చూడండి: గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.