ETV Bharat / bharat

నవంబర్ 26న గొగొయి అంత్యక్రియలు

author img

By

Published : Nov 23, 2020, 11:05 PM IST

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అంత్యక్రియలు గురువారం జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా తెలిపారు. పార్థివదేహాన్ని సందర్శించుకునేందుకు ప్రజలకు ఒకరోజు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. గొగొయి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tarun Gogoi's cremation
నవంబర్ 26న గొగొయి అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. గువాహటిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా తెలిపారు. గొగొయి మృతదేహాన్ని మంగళవారం దిస్పూర్​లోని ఆయన అధికారిక నివాసానికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర సచివాలయమైన జనతా భవన్​కు, తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నట్లు చెప్పారు.

గొగొయిని చివరిసారి సందర్శించుకునేందుకు ప్రజలకు ఒకరోజు అవకాశం ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారని... వీరి అభ్యర్థన మేరకు శ్రీమాంత శంకరదేవ కళాక్షేత్ర కాంప్లెక్స్​లో ప్రభుత్వం ఇందుకు ఏర్పాట్లు చేస్తోందని బోరా తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారమంతా గొగొయి పార్థివదేహాన్ని ఈ కళాక్షేత్రంలోనే ఉంచనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ సహా ఇతర ప్రముఖులు సమయంలో గొగొయిని చివరిసారి దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు.

నవంబర్ 26న గొగొయి అంతిమయాత్ర కళాక్షేత్రం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. స్వస్థలం టిటాబోర్ అయినప్పటికీ.. ఆయన అత్యక్రియలు మాత్రం గువాహటిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. గొగొయి చివరి కోరిక ప్రకారం ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

సంతాప దినాలు

గొగొయి మృతి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్​తో పాటు అధికార భాజపా సైతం అన్ని రకాల పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని మూడు రోజులు వాయిదా వేసుకుంది.

కాంగ్రెస్ నేతల విచారం

మరోవైపు, తరుణ్ గొగొయ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తన అసాధారణ జ్ఞానం, సామర్థ్యం, దూర దృష్టితో గౌరవం సంపాదించారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ గొగొయి కుమారుడు గౌరవ్​కు లేఖ రాశారు. ఆయన జ్ఞాపకాలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందని అన్నారు. గొగొయిను తెలివైన సలహాదారుడిగా అభివర్ణించారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. తరుణ్​ను ఎల్లప్పుడు గౌరవించారని అన్నారు.

నా స్నేహితుడు: మన్మోహన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ సైతం గొగొయి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనకు చాలా దగ్గరి స్నేహితులలో గొగొయి ఒకరని పేర్కొన్నారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎల్లప్పుడు పాటుపడ్డారని కీర్తించారు.

గొప్ప బోధకుడు: రాహుల్

తరుణ్ గొగొయి గొప్ప, తెలివైన బోధకుడు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోం ప్రజలు గొగొయి ఏకం చేశారని కొనియాడారు. ఆయన నిజమైన కాంగ్రెస్ నేత అని తెలిపారు. ఆయనను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. గొగొయి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

అనారోగ్యంతో కన్నుమూసిన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. గువాహటిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా తెలిపారు. గొగొయి మృతదేహాన్ని మంగళవారం దిస్పూర్​లోని ఆయన అధికారిక నివాసానికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర సచివాలయమైన జనతా భవన్​కు, తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నట్లు చెప్పారు.

గొగొయిని చివరిసారి సందర్శించుకునేందుకు ప్రజలకు ఒకరోజు అవకాశం ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారని... వీరి అభ్యర్థన మేరకు శ్రీమాంత శంకరదేవ కళాక్షేత్ర కాంప్లెక్స్​లో ప్రభుత్వం ఇందుకు ఏర్పాట్లు చేస్తోందని బోరా తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారమంతా గొగొయి పార్థివదేహాన్ని ఈ కళాక్షేత్రంలోనే ఉంచనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ సహా ఇతర ప్రముఖులు సమయంలో గొగొయిని చివరిసారి దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు.

నవంబర్ 26న గొగొయి అంతిమయాత్ర కళాక్షేత్రం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. స్వస్థలం టిటాబోర్ అయినప్పటికీ.. ఆయన అత్యక్రియలు మాత్రం గువాహటిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. గొగొయి చివరి కోరిక ప్రకారం ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

సంతాప దినాలు

గొగొయి మృతి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్​తో పాటు అధికార భాజపా సైతం అన్ని రకాల పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని మూడు రోజులు వాయిదా వేసుకుంది.

కాంగ్రెస్ నేతల విచారం

మరోవైపు, తరుణ్ గొగొయ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తన అసాధారణ జ్ఞానం, సామర్థ్యం, దూర దృష్టితో గౌరవం సంపాదించారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ గొగొయి కుమారుడు గౌరవ్​కు లేఖ రాశారు. ఆయన జ్ఞాపకాలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందని అన్నారు. గొగొయిను తెలివైన సలహాదారుడిగా అభివర్ణించారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. తరుణ్​ను ఎల్లప్పుడు గౌరవించారని అన్నారు.

నా స్నేహితుడు: మన్మోహన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ సైతం గొగొయి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనకు చాలా దగ్గరి స్నేహితులలో గొగొయి ఒకరని పేర్కొన్నారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎల్లప్పుడు పాటుపడ్డారని కీర్తించారు.

గొప్ప బోధకుడు: రాహుల్

తరుణ్ గొగొయి గొప్ప, తెలివైన బోధకుడు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోం ప్రజలు గొగొయి ఏకం చేశారని కొనియాడారు. ఆయన నిజమైన కాంగ్రెస్ నేత అని తెలిపారు. ఆయనను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. గొగొయి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.