ETV Bharat / bharat

మహారాష్ట్ర, తమిళనాడుపై కరోనా పంజా.. రికార్డ్​ స్థాయిలో కేసులు

author img

By

Published : Jun 20, 2020, 10:48 PM IST

Updated : Jun 20, 2020, 11:20 PM IST

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 3500లకుపైగా, తమిళనాడులో 2,300లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

TAMIL NADU RECORDS HIGHEST NUMBER OF CASES IN A SINGLE DAY
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులో 2,396కేసులు

కరోనా వైరస్​ ధాటికి దేశం విలవిలలాడుతోంది. మహారాష్ట్ర, తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,874 మంది వైరస్​ బారినపడ్డారు. 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,28,205కి, మృతుల సంఖ్య 5,984కు చేరింది.

ముంబయిలో...

మహారాష్ట్రలో వైరస్​ విజృంభిస్తోంది. మహా నగరం ముంబయిలో శనివారం ఒక్కరోజే 136 మరణాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు 3,559 మంది వైరస్​ బారిన పడి మృతి చెందారు. ముంబయిలో తాజాగా 1,197కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,265కు చేరింది.

అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో శనివారం కేవలం 7 కేసులే నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇదే అత్యల్పమని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,158 మందికి కరోనా సోకింది. 80 మంది మరణించారు.

తమిళనాడులో..

తమిళనాడులో శనివారం ఒక్కరోజే 2,396 కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 56,845కు చేరింది. తాజాగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ సోకి ఇప్పటివరకు 704 మంది మృతి చెందారు.

గుజరాత్​లో...

గుజరాత్​లో కరోనా వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా 539 మందికి వైరస్​ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం 26,737 మంది వైరస్​ బారిన పడ్డారు. ఒక్కరోజులో 20 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,639కి పెరిగింది.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 381 తాజా కేసులతో ఇప్పటివరు 14,537 మంది కరోనా బారినపడ్డారు. శనివారం నలుగురు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.

రాష్ట్రంతాజా కేసులుమొత్తం కేసులు
తమిళనాడు2,39656,845
ముంబయి1,19765,265
గుజరాత్​53926,737
కర్ణాటక4168,697
రాజస్థాన్​38114,537
కేరళ1273,039
ఛండీగఢ్​49 2,076
త్రిపుర271,186
హిమాచల్​ ప్రదేశ్​22651

కరోనా వైరస్​ ధాటికి దేశం విలవిలలాడుతోంది. మహారాష్ట్ర, తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,874 మంది వైరస్​ బారినపడ్డారు. 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,28,205కి, మృతుల సంఖ్య 5,984కు చేరింది.

ముంబయిలో...

మహారాష్ట్రలో వైరస్​ విజృంభిస్తోంది. మహా నగరం ముంబయిలో శనివారం ఒక్కరోజే 136 మరణాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు 3,559 మంది వైరస్​ బారిన పడి మృతి చెందారు. ముంబయిలో తాజాగా 1,197కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,265కు చేరింది.

అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో శనివారం కేవలం 7 కేసులే నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇదే అత్యల్పమని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,158 మందికి కరోనా సోకింది. 80 మంది మరణించారు.

తమిళనాడులో..

తమిళనాడులో శనివారం ఒక్కరోజే 2,396 కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 56,845కు చేరింది. తాజాగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ సోకి ఇప్పటివరకు 704 మంది మృతి చెందారు.

గుజరాత్​లో...

గుజరాత్​లో కరోనా వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా 539 మందికి వైరస్​ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం 26,737 మంది వైరస్​ బారిన పడ్డారు. ఒక్కరోజులో 20 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,639కి పెరిగింది.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 381 తాజా కేసులతో ఇప్పటివరు 14,537 మంది కరోనా బారినపడ్డారు. శనివారం నలుగురు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.

రాష్ట్రంతాజా కేసులుమొత్తం కేసులు
తమిళనాడు2,39656,845
ముంబయి1,19765,265
గుజరాత్​53926,737
కర్ణాటక4168,697
రాజస్థాన్​38114,537
కేరళ1273,039
ఛండీగఢ్​49 2,076
త్రిపుర271,186
హిమాచల్​ ప్రదేశ్​22651
Last Updated : Jun 20, 2020, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.