తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృ వియోగం కలిగింది. సాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాత్రి 12.15 గంటలకు తావుసాయమ్మల్ (93) కన్నుమూశారు.

తూత్తుకుడిలో కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి పళనిస్వామి. తన తల్లి మరణవార్త తెలియగానే అక్కడి నుంచి వెంటనే సాలెంకు తిరిగివచ్చారు. రెండురోజుల పాటు ఆయన షెడ్యూళ్లు వాయిదావేశారు.
ఇదీ చూడండి:కోయంబేడులో మళ్లీ కరోనా కలకలం.!