ETV Bharat / bharat

బలపరీక్ష వ్యాజ్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ

author img

By

Published : Mar 18, 2020, 5:09 AM IST

మధ్యప్రదేశ్​ శాసనసభలో తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్న వ్యాజ్యంపై నేడు విచారణ కొనసాగించనుంది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్​పై స్పందించాలని ఇప్పటికే కమల్​నాథ్​ సర్కార్​కు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం.

madhyapradesh
మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్​పై బుధవారం ఉదయం 10.30 గంటల లోపు సమాధానమివ్వాలని కమల్​నాథ్​ సర్కారును ఆదేశించింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి పేరిట నోటీసులు జారీ చేసింది.

నిన్న జరిగిన విచారణలో భాగంగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు శివరాజ్​సింగ్ చౌహన్ తరఫు న్యాయవాది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా.. ఆరుగురికి ఆమోదం లభించిందని, మిగిలినవారూ తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. విచారణ అనంతరం మెజారిటీక అవసరమైన సభ్యులు తమవద్ద ఉన్నారని చౌహాన్​ స్పష్టం చేశారు.

లేఖల యుద్ధం..

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో లేఖల యుద్ధం కొనసాగుతోంది. అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చూడమంటూ ఎంపీ గవర్నర్​ లాల్జీ టాండన్​కు​ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఓ లేఖ రాశారు. ఈ ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవడం సహా వారి కుటుంబసభ్యుల సందేహాలు తీర్చాలని ప్రజాపతి గవర్నర్​ను కోరారు. తనకు రాజీనామా పత్రాలు సమర్పించే సమయంలో ఈ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులెవరూ లేరని ప్రజాపతి తెలిపారు. రాజీనామాలు స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే, కుటుంబసభ్యులు ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.

'అలా ఎక్కడా లేదే..'

ఈ లేఖపై స్పందించిన గవర్నర్​.. స్పీకర్​కు మరో లేఖ రాశారు. ఎమ్మెల్యేలు రాసిన లేఖల్లో ఎక్కడా తమను నిర్బంధంలో పెట్టారని గానీ.. ఇబ్బందులు ఉన్నట్లు గానీ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు గవర్నర్​.

భాజపా తమ ఎమ్మెల్యేలను బెంగళూరులో దాచి పెట్టిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా భాజపా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలను కలవడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్.

సింధియా తిరుగుబాటు..

కాంగ్రెస్ అసమ్మతి నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు నేపథ్యంలో కమల్​నాథ్​ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గవర్నర్​ ఆదేశాల మేరకు సోమవారమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా మార్చి 26 వరకు శాసనసభను వాయిదా వేశారు స్పీకర్ ఎన్​పీ ప్రజాపతి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ సహా మరో తొమ్మిది మంది శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'ప్రాథమిక హక్కులను సీఏఏ హరించదు'

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్​పై బుధవారం ఉదయం 10.30 గంటల లోపు సమాధానమివ్వాలని కమల్​నాథ్​ సర్కారును ఆదేశించింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి పేరిట నోటీసులు జారీ చేసింది.

నిన్న జరిగిన విచారణలో భాగంగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు శివరాజ్​సింగ్ చౌహన్ తరఫు న్యాయవాది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా.. ఆరుగురికి ఆమోదం లభించిందని, మిగిలినవారూ తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. విచారణ అనంతరం మెజారిటీక అవసరమైన సభ్యులు తమవద్ద ఉన్నారని చౌహాన్​ స్పష్టం చేశారు.

లేఖల యుద్ధం..

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో లేఖల యుద్ధం కొనసాగుతోంది. అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చూడమంటూ ఎంపీ గవర్నర్​ లాల్జీ టాండన్​కు​ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఓ లేఖ రాశారు. ఈ ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అదృశ్యమైన ఎమ్మెల్యేలు తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవడం సహా వారి కుటుంబసభ్యుల సందేహాలు తీర్చాలని ప్రజాపతి గవర్నర్​ను కోరారు. తనకు రాజీనామా పత్రాలు సమర్పించే సమయంలో ఈ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులెవరూ లేరని ప్రజాపతి తెలిపారు. రాజీనామాలు స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే, కుటుంబసభ్యులు ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.

'అలా ఎక్కడా లేదే..'

ఈ లేఖపై స్పందించిన గవర్నర్​.. స్పీకర్​కు మరో లేఖ రాశారు. ఎమ్మెల్యేలు రాసిన లేఖల్లో ఎక్కడా తమను నిర్బంధంలో పెట్టారని గానీ.. ఇబ్బందులు ఉన్నట్లు గానీ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు గవర్నర్​.

భాజపా తమ ఎమ్మెల్యేలను బెంగళూరులో దాచి పెట్టిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా భాజపా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలను కలవడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్.

సింధియా తిరుగుబాటు..

కాంగ్రెస్ అసమ్మతి నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు నేపథ్యంలో కమల్​నాథ్​ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గవర్నర్​ ఆదేశాల మేరకు సోమవారమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా మార్చి 26 వరకు శాసనసభను వాయిదా వేశారు స్పీకర్ ఎన్​పీ ప్రజాపతి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ సహా మరో తొమ్మిది మంది శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'ప్రాథమిక హక్కులను సీఏఏ హరించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.