సుప్రీం కోర్టు నేడు పలు పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ-2018ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై తీర్పు వెలువరించనుంది.
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ పొందడానికి వీలులేకుండా ఈ చట్టం నిబంధనలు తొలగించినట్లు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. అట్రాసిటీ పేరుతో వేదింపులకు పాల్పడుతున్నారని.. బాధితులకు న్యాయం చేయాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
షహీన్బాగ్ నిరసనలకారుల తొలగింపు..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్బాగ్లో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం న్యాయస్థానం.
ఇదీ చూడండి: '2022లో భారత్-బంగ్లాదేశ్ మధ్య రైలు కూత'