ETV Bharat / bharat

ఈద్​ కోసం దివ్యాంగుల 400 కిలోమీటర్ల ప్రయాణం - అసోం దివ్యాంగుల ప్రయాణం

అసోంకు చెందిన ఇద్దరు దివ్యాంగులు తమ మూడు చక్రాల సైకిల్​పైనే 400 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు. లాక్​డౌన్​ వల్ల రాష్ట్రంలోని నౌజాన్​ ప్రాంతంలో చిక్కుకుపోయామని... ఈద్​లోపు ఎలాగైనా సిల్చార్​లోని సొంతింటికి వెళ్లాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

stranded-by-lock-down-two-differently-able-youth-in-assam-plans-to-paddle-home
ఈద్​ కోసం దివ్యాంగుల 400 కిలీమీటర్ల ప్రయణం
author img

By

Published : Apr 28, 2020, 6:36 AM IST

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​ వల్ల ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. ఫలితంగా వలస కూలీలతో పాటు అనేకమంది కాలినడకన తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దివ్యాంగులకు కూడా ఈ లాక్​డౌన్ తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆసోంలోని ఇద్దరు దివ్యాంగులు తమ మూడు చక్రాల సైకిల్​పైనే 400 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఈద్​లోపు...

అలీ హుస్సేన్​, అక్తర్​ హుస్సేన్​ అనే దివ్యాంగులు.. అసోంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గోలఘాట్ జిల్లా​లోని నౌజాన్​లో యాచిస్తూ కాలం గడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వారు అక్కడే ఉండిపోయారు. 33రోజుల పాటు ఇతరుల ఇంట్లో ఉండి నిరీక్షించారు. రంజాన్ మాసం ఆరంభం కావడం.. లాక్​డౌన్ ఎత్తివేతపై స్పష్టత లేకపోయినందున .. సహనం కోల్పోయారు. ఎలాగైనా సొంతింటికి వెళ్లాలని నిర్ణయించుకుని 400 కిలోమీటర్ల దూరంలోని సిల్చార్​కు బయల్దేరారు. ఆదివారం నాటికి 90 కిలోమీటర్లు ప్రయాణించారు.

"లాక్​డౌన్​ వల్ల నౌజాన్​లో చిక్కుకుపోయాం. కానీ పవిత్ర రంజాన్​ మాసం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో ఈద్​ జరుపుకోవాలని ఉంది. అందుకే ఈ ప్రయాణం ప్రారంభించాం. ఈద్​లోపు ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం."

--- అలీ హుస్సేన్​, వికలాంగుడు.

అలీ, అక్తర్​లు రోజంతా చక్రాల కుర్చీలో ప్రయాణించి..​ రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల ముందు పడుకుంటున్నారు. ఎలాగైనా ఈద్​లోపు ఇంటికి చేరాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు.

ఈద్​ కోసం దివ్యాంగుల 400 కిలోమీటర్ల ప్రయణం

ఇదీ చూడండి:- సీఎం కాన్వాయ్​ కోసం అంబులెన్స్​ను ఆపటంపై విమర్శలు

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​ వల్ల ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. ఫలితంగా వలస కూలీలతో పాటు అనేకమంది కాలినడకన తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దివ్యాంగులకు కూడా ఈ లాక్​డౌన్ తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆసోంలోని ఇద్దరు దివ్యాంగులు తమ మూడు చక్రాల సైకిల్​పైనే 400 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఈద్​లోపు...

అలీ హుస్సేన్​, అక్తర్​ హుస్సేన్​ అనే దివ్యాంగులు.. అసోంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గోలఘాట్ జిల్లా​లోని నౌజాన్​లో యాచిస్తూ కాలం గడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వారు అక్కడే ఉండిపోయారు. 33రోజుల పాటు ఇతరుల ఇంట్లో ఉండి నిరీక్షించారు. రంజాన్ మాసం ఆరంభం కావడం.. లాక్​డౌన్ ఎత్తివేతపై స్పష్టత లేకపోయినందున .. సహనం కోల్పోయారు. ఎలాగైనా సొంతింటికి వెళ్లాలని నిర్ణయించుకుని 400 కిలోమీటర్ల దూరంలోని సిల్చార్​కు బయల్దేరారు. ఆదివారం నాటికి 90 కిలోమీటర్లు ప్రయాణించారు.

"లాక్​డౌన్​ వల్ల నౌజాన్​లో చిక్కుకుపోయాం. కానీ పవిత్ర రంజాన్​ మాసం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో ఈద్​ జరుపుకోవాలని ఉంది. అందుకే ఈ ప్రయాణం ప్రారంభించాం. ఈద్​లోపు ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం."

--- అలీ హుస్సేన్​, వికలాంగుడు.

అలీ, అక్తర్​లు రోజంతా చక్రాల కుర్చీలో ప్రయాణించి..​ రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల ముందు పడుకుంటున్నారు. ఎలాగైనా ఈద్​లోపు ఇంటికి చేరాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు.

ఈద్​ కోసం దివ్యాంగుల 400 కిలోమీటర్ల ప్రయణం

ఇదీ చూడండి:- సీఎం కాన్వాయ్​ కోసం అంబులెన్స్​ను ఆపటంపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.