ETV Bharat / bharat

కర్ణాటకలో కరోనా విజృంభణ- కొత్తగా 7,571 కేసులు

author img

By

Published : Aug 21, 2020, 7:32 PM IST

Updated : Aug 21, 2020, 7:38 PM IST

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో కొత్తగా మరో 5,995 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. 101 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మరో 7వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి.

INDIA CORONA UPDATES
తమిళనాడుపై కోరలుచాచిన కరోనా- మరో  5,995 మందికి వైరస్​

దేశంలో కొవిడ్​-19 విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాట కొద్దిరోజులుగా రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 5,995 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,67,430కు చేరింది. మరో 101 మరణాలతో, మృతుల సంఖ్య 6,340కు పెరిగింది.

అయితే.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 3,07,677 మందికి మహమ్మారి నయమవగా.. 53,413 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలో మరో 7 వేలకు పైగా..

కన్నడనాట కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 7,571 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 2,64,546కు పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 93 మంది బలవ్వగా, మొత్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,522కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,76,942 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

యూపీలో కొత్తగా 4,991 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,77,239కి చేరింది. మరో 66 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,797కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,26,657 మందికి వైరస్​ నయమవగా.. 47,785 యాక్టివ్​ కేసులున్నాయి.

రాజధానిలో మళ్లీ..

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 1,250 మందికి కొవిడ్​గా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,58,604కు చేరింది. మహమ్మారి కారణంగా మరో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరణాల సంఖ్య 4,270కు ఎగబాకింది.

కేరళలో..

కేరళలో కొత్తగా 1,983 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 54,182కు చేరింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో సుమారు 35,247 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఆయా రాష్టాల్లో కరోనా వివరాలు..

రాష్ట్రంకొత్త కేసులుమొత్తం కేసులు
ఒడిశా2,69872,718
ఝార్ఖండ్94127,241
త్రిపుర2568,109
అరుణాచల్​ప్రదేశ్​1163,066
మేఘాలయ551,716

ఇదీ చదవండి: ఆ దేశాల నుంచి భారత్​ నేర్వాల్సిన పాఠాలివే...

దేశంలో కొవిడ్​-19 విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాట కొద్దిరోజులుగా రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 5,995 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,67,430కు చేరింది. మరో 101 మరణాలతో, మృతుల సంఖ్య 6,340కు పెరిగింది.

అయితే.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 3,07,677 మందికి మహమ్మారి నయమవగా.. 53,413 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలో మరో 7 వేలకు పైగా..

కన్నడనాట కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 7,571 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 2,64,546కు పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 93 మంది బలవ్వగా, మొత్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,522కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,76,942 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

యూపీలో కొత్తగా 4,991 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,77,239కి చేరింది. మరో 66 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,797కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,26,657 మందికి వైరస్​ నయమవగా.. 47,785 యాక్టివ్​ కేసులున్నాయి.

రాజధానిలో మళ్లీ..

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 1,250 మందికి కొవిడ్​గా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,58,604కు చేరింది. మహమ్మారి కారణంగా మరో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరణాల సంఖ్య 4,270కు ఎగబాకింది.

కేరళలో..

కేరళలో కొత్తగా 1,983 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 54,182కు చేరింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో సుమారు 35,247 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఆయా రాష్టాల్లో కరోనా వివరాలు..

రాష్ట్రంకొత్త కేసులుమొత్తం కేసులు
ఒడిశా2,69872,718
ఝార్ఖండ్94127,241
త్రిపుర2568,109
అరుణాచల్​ప్రదేశ్​1163,066
మేఘాలయ551,716

ఇదీ చదవండి: ఆ దేశాల నుంచి భారత్​ నేర్వాల్సిన పాఠాలివే...

Last Updated : Aug 21, 2020, 7:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.