ETV Bharat / bharat

తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

author img

By

Published : Aug 13, 2020, 1:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​​ జిల్లాలో దారుణం జరిగింది. గురక పెడుతూ నిద్రపోనియడం లేదనే కోపంతో తండ్రిని కన్న కొడుకు సుత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

Son kills 65-year-old father for snoring
గురక పెడుతున్న తండ్రిని కొట్టి చంపిన కోడుకు

గురక పెడుతున్నాడనే కారణంతో కన్న తండ్రిని కొడుకు అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ పీలీభీత్​ జిల్లాలో జరిగింది. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.

పీలీభీత్​​ జిల్లా సోందా గ్రామంలో నివాసం ఉంటున్నాడు రామ్​ స్వరూప్​. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నవీన్, చిన్న కుమారుడు మనోజ్​. నిద్ర పోయే సమయంలో బాగా గురక పెడుతున్నాడనే కోపంతో తండ్రిని సుత్తితో కొట్టాడు నవీన్. గాయపడిన స్వరూప్​ను చుట్టపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు మరణించాడని వైద్యులు నిర్ధరించారు. నవీన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గురక పెడుతున్నాడనే కారణంతో కన్న తండ్రిని కొడుకు అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ పీలీభీత్​ జిల్లాలో జరిగింది. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.

పీలీభీత్​​ జిల్లా సోందా గ్రామంలో నివాసం ఉంటున్నాడు రామ్​ స్వరూప్​. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నవీన్, చిన్న కుమారుడు మనోజ్​. నిద్ర పోయే సమయంలో బాగా గురక పెడుతున్నాడనే కోపంతో తండ్రిని సుత్తితో కొట్టాడు నవీన్. గాయపడిన స్వరూప్​ను చుట్టపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు మరణించాడని వైద్యులు నిర్ధరించారు. నవీన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:3 కోట్ల మాస్క్​ల ఉచిత పంపిణీ: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.