ETV Bharat / bharat

బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!

author img

By

Published : Jun 6, 2020, 4:37 PM IST

ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడి, కన్నవారికి కడుపుకోత మిగిల్చారు ఇద్దరు యువకులు. తల్లిదండ్రులు రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనివ్వలేదని తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలో కేవలం రూ.200 ఇవ్వలేదని అమ్మ మీద కోపంలో ప్రాణాలు తీసుకున్నాడు మరొక వ్యక్తి.

son commits suicide after mother refuses to give 200 rupees
బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!

ఈ కాలంలో చిన్న సమస్యనే భూతద్దంలో పెట్టి చూసుకుని.. ప్రపంచంలో తమలాంటి బాధ ఎవ్వరికీ లేదనట్టు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువకులు. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లేక తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.

son commits suicide after mother refuses to give 200 rupees
వసంతకుమార్​

తమిళనాడు కోయంబత్తూర్​లోని తడగామ్​కు చెందిన 25 ఏళ్ల వసంతకుమార్​.. ఓ ఐటీ కంపెనీలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. కానీ, వారి దగ్గర అంత డబ్బులేదని.. ఆర్థిక స్థితి కుదుటపడ్డాక కొనిస్తామన్నారు. బైక్​ కొనలేమన్నారనే కోపంతో రాత్రి 9:30 గంటల దాకా మద్యం తాగాడు వసంత్​. ఇంటికొచ్చి మళ్లీ బైక్​ గురించి గొడవపడ్డాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లిపోయాడు. తల్లి ఉదయం లేచి చూసేసరికి వసంత్​ ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.

200 రూపాయలు ఇవ్వలేదని..!

son commits suicide after mother refuses to give 200 rupees
సర్వేశ్​ ఇంగిల్

ఇక మహారాష్ట్ర వాద్రాలో 18 ఏళ్ల సర్వేశ్​ ఇంగిల్​ క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సర్వేశ్​ తండ్రి ఆశీర్వాద్ ఇంగిల్​.. గడ్చిరోలి పోలీస్​ స్టేషన్​లో ఉద్యోగి. లాక్​డౌన్​ కారణంగా ఇంటికి దూరంగా ఉండిపోయాడు. దీంతో, సర్వేశ్​ రూ.200 కావాలని తల్లిని కోరాడు. వృధా ఖర్చులు చేస్తున్నాడని.. డబ్బులిచ్చేందుకు తల్లి ససేమీరా అంది. అంతే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో తండ్రికి ఫోన్​ చేశాడు. తండ్రి కూడా డబ్బులు ఎందుకు అని ప్రశ్నించేసరికి ఆవేశంలో ఫోన్ పెట్టేశాడు. ఆ వెంటనే ఆశీర్వాద్..​ కుమారుడికి ఫోన్ చేసి డబ్బు పంపుతున్నానని చెప్పాడు. కానీ, 'నాకు మీ డబ్బు అక్కర్లేదని' ఫోన్​ పెట్టేసిన సర్వేశ్.​. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారాడు.

ఇదీ చదవండి:ముంబయిలో ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ల్యాడర్

ఈ కాలంలో చిన్న సమస్యనే భూతద్దంలో పెట్టి చూసుకుని.. ప్రపంచంలో తమలాంటి బాధ ఎవ్వరికీ లేదనట్టు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువకులు. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లేక తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.

son commits suicide after mother refuses to give 200 rupees
వసంతకుమార్​

తమిళనాడు కోయంబత్తూర్​లోని తడగామ్​కు చెందిన 25 ఏళ్ల వసంతకుమార్​.. ఓ ఐటీ కంపెనీలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. కానీ, వారి దగ్గర అంత డబ్బులేదని.. ఆర్థిక స్థితి కుదుటపడ్డాక కొనిస్తామన్నారు. బైక్​ కొనలేమన్నారనే కోపంతో రాత్రి 9:30 గంటల దాకా మద్యం తాగాడు వసంత్​. ఇంటికొచ్చి మళ్లీ బైక్​ గురించి గొడవపడ్డాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లిపోయాడు. తల్లి ఉదయం లేచి చూసేసరికి వసంత్​ ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.

200 రూపాయలు ఇవ్వలేదని..!

son commits suicide after mother refuses to give 200 rupees
సర్వేశ్​ ఇంగిల్

ఇక మహారాష్ట్ర వాద్రాలో 18 ఏళ్ల సర్వేశ్​ ఇంగిల్​ క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సర్వేశ్​ తండ్రి ఆశీర్వాద్ ఇంగిల్​.. గడ్చిరోలి పోలీస్​ స్టేషన్​లో ఉద్యోగి. లాక్​డౌన్​ కారణంగా ఇంటికి దూరంగా ఉండిపోయాడు. దీంతో, సర్వేశ్​ రూ.200 కావాలని తల్లిని కోరాడు. వృధా ఖర్చులు చేస్తున్నాడని.. డబ్బులిచ్చేందుకు తల్లి ససేమీరా అంది. అంతే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో తండ్రికి ఫోన్​ చేశాడు. తండ్రి కూడా డబ్బులు ఎందుకు అని ప్రశ్నించేసరికి ఆవేశంలో ఫోన్ పెట్టేశాడు. ఆ వెంటనే ఆశీర్వాద్..​ కుమారుడికి ఫోన్ చేసి డబ్బు పంపుతున్నానని చెప్పాడు. కానీ, 'నాకు మీ డబ్బు అక్కర్లేదని' ఫోన్​ పెట్టేసిన సర్వేశ్.​. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారాడు.

ఇదీ చదవండి:ముంబయిలో ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ల్యాడర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.