ETV Bharat / bharat

దిల్లీలో దుమ్ముపడుతున్న జాకెట్లు- చలితో సైనికుల పోరాటం

author img

By

Published : Oct 19, 2020, 1:15 PM IST

Updated : Oct 19, 2020, 1:20 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. నియంత్రణ రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో గడ్డకట్టించే చలిలో బలగాలను మోహరించింది భారత సైన్యం. వారిప్పుడు చలితో పోరాటంలో కావాల్సిన జాకెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. క్లిష్టమైన ప్రదేశాలుగా ఉన్న సియాచిన్, డోక్లాం, లద్దాఖ్​లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక లోపాలు ఉన్నాయని వెల్లడించింది కంప్ట్రోలర్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్) నివేదిక. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.

Soldiers shiver in Ladakh
శీతాకాలంలో వణుకుతున్న సైనికులు.. సదుపాయాల కల్పనలో సవాళ్లు ?

హిమాలయాల సరిహద్దులో శీతాకాలం ముంచుకొచ్చింది. గడ్డకట్టించే చలిలో గస్తీ కాయాలంటే సైన్యానికి ప్రత్యేక జాకెట్లు అవసరం. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో బలగాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వారికి ప్రస్తుతం అత్యవసరమైన 15,000 జాకెట్లు.. గత 15రోజులుగా దిల్లీలోని ఆర్డినెన్స్​ డిపోలో పోగుపడి ఉన్నాయి.

ప్రత్యేక జాకెట్లకు ఆర్డర్​

ఓవైపు సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. భారత్​-చైనాల మధ్య పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో హై-ఆల్టిట్యూడ్ క్లోతింగ్​ అండ్​ ఎక్విప్​మెంట్ (హెఏసీఈ) .. 30,000 ప్రత్యేక జాకెట్ల తయారీకి అమెరికాకు చెందిన సంస్థకు ఆర్డరిచ్చింది.

అత్యున్నత వర్గాల సమాచారం మేరకు.. ఈ ఒప్పందం కొన్నిరోజుల్లోనే ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత్యవసరంగా ఇవి కావాల్సిన నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా.. 15,000జాకెట్లు అక్టోబర్​ 2నే భారత్​ చేరుకున్నాయి. కానీ, 15రోజులుగా అవి దిల్లీలోని భాండాగారంలోనే ఉన్నాయని, సైనికులు వీటి కోసం ఎదురుచూస్తున్నారని.. ఈటీవీ భారత్​కు వివరించారు.

ఇదే విషయంపై సైనిక ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వారి సమాధానం వేరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో సరిపడా ఉన్నాయని, అంత అత్యవసరం లేదని అంటూనే.. త్వరలోనే వీటిని లద్దాఖ్​ చేరుస్తామని చెబుతున్నారు.

కాగ్​ నివేదిక..

ఈ ఏడాది విడుదల చేసిన కాగ్ నివేదిక.. సరిహద్దు సైనిక సదుపాయలకు సంబంధించి కీలక విషయాలు వివరించింది. సియాచిన్, డోక్లాం, లద్దాఖ్​లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించింది. సైనికులు దూరప్రాంతాలను స్పష్టంగా చూడగలిగేలా.. ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీఈ) విభాగానికి చెందిన, 'ఆల్ టెర్రైన్​ గాగుల్స్'​ వినియోగిస్తారు. పహారాలో కీలకంగా నిలిచే వీటి లభ్యత 5.6% నుంచి 16.07%కు మాత్రమే పెరిగింది. పేలవమైన సరఫరా కారణంగా కావాల్సినదాని కంటే, అందుబాటులో ఉన్నవి తక్కువగా ఉన్నాయని తేల్చింది కాగ్​.

కీలకం కానున్న కొత్త జాకెట్లు !

మరోవైపు ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఎల్​ఏసీ వెంట దాదాపు -25డిగ్రీల కిందకు పడిపోయినా.. సైనికులు తమ తాత్కాలిక గుడారాల్లోనే చలితో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తీసుకొచ్చిన ఈ జాకెట్లు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు. మూడు పొరలతో, ఒక హుడీ... అలాగే తక్కువ బరువుతో ఉండే ఈ జాకెట్లు గాలిలో ఆక్సిజన్ క్షీణించిన ప్రాంతాలలో చాలా కీలకంగా ఉంటాయి.

ఈ జాకెట్లలో లోపలోభాగం.. ఉన్నితో ఉంటుంది. వెలుపల పాలిస్టర్​తో ఉంటుంది. బరువు సైతం 2.5కిలోలకు మించదు. ఈ థర్మల్ దుస్తులు నీటిలో తడవవు. విపరీతమైన చలిని, చలిగాలులను ఎదుర్కోవటానికి అనువైనవి. ఈ ప్రత్యేక జాకెట్లు ఒకేసారి.. ఒక సైనికుడికి ఇస్తారు. పునర్వినియోగించే అవకాశం ఉండదు.

సరఫరా విభాగాలు..

ప్రస్తుతం ఎల్​ఏసీ వెంట.. దాదాపు 50,000మంది సైనికులు ఉన్నారు. ఏప్రిల్-మే నుంచి భారత్​-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. చల్లారడం లేదు. మొదట్లో ఈ ప్రాంతంలో సైనికులు, సామగ్రి రెండింటి సరఫరా తక్కువగా ఉండేది. ఇవి వేగంగా విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న హెచ్ఏసీఈ ఆధ్వర్యంలో ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీ&ఈ) అలాగే, స్పెషల్​ క్లోతింగ్​ అండ్​ మౌంటెనీరింగ్​ ఎక్విప్​మెంట్ (ఎస్​సీఎంఈ) విభాగాలు ఇందుకోసం పని చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈసీసీఈ వస్తువులు సామాగ్రి తూర్పు కమాండ్​లో 9,000అడుగుల ఎత్తులో మోహరించిన సైనికులకు, ఇతర కమాండ్​లలో 6,000 అడుగుల ఎత్తులో పహారా కాస్తున్న బలగాలకు అందిస్తారు. ఎస్​సీఎంఈ.. వస్తువులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న సైనికులకు అందజేస్తారు. గతంలో సియాచెన్​ బలగాలకు ఇచ్చేవారు. ఇప్పుడు తూర్పు లద్దాఖ్​లోని బృందాలకు ఇస్తున్నారు.

-సంజీవ్​ బారువా

హిమాలయాల సరిహద్దులో శీతాకాలం ముంచుకొచ్చింది. గడ్డకట్టించే చలిలో గస్తీ కాయాలంటే సైన్యానికి ప్రత్యేక జాకెట్లు అవసరం. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో బలగాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వారికి ప్రస్తుతం అత్యవసరమైన 15,000 జాకెట్లు.. గత 15రోజులుగా దిల్లీలోని ఆర్డినెన్స్​ డిపోలో పోగుపడి ఉన్నాయి.

ప్రత్యేక జాకెట్లకు ఆర్డర్​

ఓవైపు సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. భారత్​-చైనాల మధ్య పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో హై-ఆల్టిట్యూడ్ క్లోతింగ్​ అండ్​ ఎక్విప్​మెంట్ (హెఏసీఈ) .. 30,000 ప్రత్యేక జాకెట్ల తయారీకి అమెరికాకు చెందిన సంస్థకు ఆర్డరిచ్చింది.

అత్యున్నత వర్గాల సమాచారం మేరకు.. ఈ ఒప్పందం కొన్నిరోజుల్లోనే ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత్యవసరంగా ఇవి కావాల్సిన నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా.. 15,000జాకెట్లు అక్టోబర్​ 2నే భారత్​ చేరుకున్నాయి. కానీ, 15రోజులుగా అవి దిల్లీలోని భాండాగారంలోనే ఉన్నాయని, సైనికులు వీటి కోసం ఎదురుచూస్తున్నారని.. ఈటీవీ భారత్​కు వివరించారు.

ఇదే విషయంపై సైనిక ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వారి సమాధానం వేరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో సరిపడా ఉన్నాయని, అంత అత్యవసరం లేదని అంటూనే.. త్వరలోనే వీటిని లద్దాఖ్​ చేరుస్తామని చెబుతున్నారు.

కాగ్​ నివేదిక..

ఈ ఏడాది విడుదల చేసిన కాగ్ నివేదిక.. సరిహద్దు సైనిక సదుపాయలకు సంబంధించి కీలక విషయాలు వివరించింది. సియాచిన్, డోక్లాం, లద్దాఖ్​లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించింది. సైనికులు దూరప్రాంతాలను స్పష్టంగా చూడగలిగేలా.. ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీఈ) విభాగానికి చెందిన, 'ఆల్ టెర్రైన్​ గాగుల్స్'​ వినియోగిస్తారు. పహారాలో కీలకంగా నిలిచే వీటి లభ్యత 5.6% నుంచి 16.07%కు మాత్రమే పెరిగింది. పేలవమైన సరఫరా కారణంగా కావాల్సినదాని కంటే, అందుబాటులో ఉన్నవి తక్కువగా ఉన్నాయని తేల్చింది కాగ్​.

కీలకం కానున్న కొత్త జాకెట్లు !

మరోవైపు ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఎల్​ఏసీ వెంట దాదాపు -25డిగ్రీల కిందకు పడిపోయినా.. సైనికులు తమ తాత్కాలిక గుడారాల్లోనే చలితో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తీసుకొచ్చిన ఈ జాకెట్లు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు. మూడు పొరలతో, ఒక హుడీ... అలాగే తక్కువ బరువుతో ఉండే ఈ జాకెట్లు గాలిలో ఆక్సిజన్ క్షీణించిన ప్రాంతాలలో చాలా కీలకంగా ఉంటాయి.

ఈ జాకెట్లలో లోపలోభాగం.. ఉన్నితో ఉంటుంది. వెలుపల పాలిస్టర్​తో ఉంటుంది. బరువు సైతం 2.5కిలోలకు మించదు. ఈ థర్మల్ దుస్తులు నీటిలో తడవవు. విపరీతమైన చలిని, చలిగాలులను ఎదుర్కోవటానికి అనువైనవి. ఈ ప్రత్యేక జాకెట్లు ఒకేసారి.. ఒక సైనికుడికి ఇస్తారు. పునర్వినియోగించే అవకాశం ఉండదు.

సరఫరా విభాగాలు..

ప్రస్తుతం ఎల్​ఏసీ వెంట.. దాదాపు 50,000మంది సైనికులు ఉన్నారు. ఏప్రిల్-మే నుంచి భారత్​-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. చల్లారడం లేదు. మొదట్లో ఈ ప్రాంతంలో సైనికులు, సామగ్రి రెండింటి సరఫరా తక్కువగా ఉండేది. ఇవి వేగంగా విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న హెచ్ఏసీఈ ఆధ్వర్యంలో ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీ&ఈ) అలాగే, స్పెషల్​ క్లోతింగ్​ అండ్​ మౌంటెనీరింగ్​ ఎక్విప్​మెంట్ (ఎస్​సీఎంఈ) విభాగాలు ఇందుకోసం పని చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈసీసీఈ వస్తువులు సామాగ్రి తూర్పు కమాండ్​లో 9,000అడుగుల ఎత్తులో మోహరించిన సైనికులకు, ఇతర కమాండ్​లలో 6,000 అడుగుల ఎత్తులో పహారా కాస్తున్న బలగాలకు అందిస్తారు. ఎస్​సీఎంఈ.. వస్తువులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న సైనికులకు అందజేస్తారు. గతంలో సియాచెన్​ బలగాలకు ఇచ్చేవారు. ఇప్పుడు తూర్పు లద్దాఖ్​లోని బృందాలకు ఇస్తున్నారు.

-సంజీవ్​ బారువా

Last Updated : Oct 19, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.