ETV Bharat / bharat

'సామాజిక దిగ్గజాలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి'

సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఉపయోగించే సాంకేతికత వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతంగా మారిందని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా సంస్థలకు కల్పించిన రక్షణలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశమై 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడారు. సోషల్ మీడియా సంస్థల అధిపతులకు పక్షపాతం ఉంటే.. అది సాంకేతికతలోనూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

author img

By

Published : May 31, 2020, 3:20 PM IST

interview on social media
'సామాజిక దిగ్గజాలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి'
'సామాజిక దిగ్గజాలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి'

ట్విట్టర్​, ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థలకు ఉన్న రక్షణలను తొలగించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో పోస్ట్​ చేసే సమాచార విశ్లేషణ, ప్రచారం కల్పించడంలో వినియోగించే ప్రమాణాలు, నిబంధనల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అంశాల్లో అల్గారిథమ్​లను వినియోగిస్తున్నామన్న పేరుతో చాలాకాలంగా పరిశీలించడం మానేశాయి. అయితే సామాజిక దిగ్గజాలు ఉపయోగించే అల్గారిథమ్​లు వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ సాంకేతికతను పరిశీలించాలని పేర్కొంటున్నారు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్.

"సామాజిక మాధ్యమాల నియంత్రణ విధానంలో చాలా తీవ్ర సమస్యలున్నాయి. భారత రాజ్యాంగం వ్యక్తులకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. అయితే ఆర్టికల్ 19(2) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని ప్రత్యేక పరిమితులు మాత్రమే ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా ట్విట్టర్​ వంటి సామాజిక మాధ్యమాలు ఏ పోస్ట్​కు అయినా ప్రాచుర్యం కల్పించేందుకు.. అణిచిపెట్టి ఉంచేందుకు ఉపకరించే సాంకేతికతను కలిగి ఉన్నాయి."

-రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ, రాజ్యసభ

సాంకేతికతకూ పక్షపాతం..

సామాజిక మాధ్యమాలు ఉపయోగించే సాంకేతకతకు విశ్వసనీయత ఉండాలని అభిప్రాయపడ్డారు రాజీవ్. సామాజిక మాధ్యమాలు ఉపయోగించే ప్రమాణాల్లో పారదర్శకత లేదని ఆయన గత కొంతకాలంగా వాదిస్తున్నారు. వ్యక్తులు పెట్టే పోస్ట్​లను విశ్లేషించి ఆటోమేటిక్​గా అనుమతించకపోవడంపై అభ్యంతరం లేవనెత్తారు రాజీవ్. ఇందులో సామాజిక మాధ్యమాల పాత్ర ఏమీ లేదని వాదించడం సరికాదన్నారు. సాంకేతికతను తయారుచేసింది మనుషులేనని పేర్కొన్నారు. మనుషులకు పక్షపాతం ఉన్నప్పుడు సాంకేతికతకు కూడా పక్షపాతం ఉంటుందని చెప్పుకొచ్చారు.

నియంత్రణ పరిధిలోకి తేవాల్సిందే..

సామాజిక మాధ్యమ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్​డ్ ఇన్ వంటి సంస్థలు ఉపయోగిస్తున్న సాఫ్ట్​వేర్లను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు రాజీవ్.

రాజకీయ శక్తులతో సంబంధాలు.. సరికాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. కొన్ని సామాజిక మాధ్యమాల సంస్థలు.. వ్యవస్థాపకులకు అనువైన సిద్ధాంతానికి అనుగుణంగా పక్షపాతం చూపుతున్నాయన్న అభిప్రాయాన్ని బలపరుస్తోందన్నారు. ప్రజలు సామాజిక దిగ్గజాలను నవీన ఆవిష్కరణలు, ఏ విధమైన ఆంక్షలు లేనివని విశ్వసిస్తున్న సందర్భంలో.. కొన్ని రాజకీయ శక్తులతో కలిసి పనిచేయడం సరికాదని చెప్పుకొచ్చారు రాజీవ్. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలను పోస్ట్​ చేయడమూ సరియైన విధానం కాదన్నారు.

ఇదీ చూడండి: మోదీ 'జీవిత చరిత్ర'పై కొత్త పుస్తకం విడుదల

'సామాజిక దిగ్గజాలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి'

ట్విట్టర్​, ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థలకు ఉన్న రక్షణలను తొలగించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో పోస్ట్​ చేసే సమాచార విశ్లేషణ, ప్రచారం కల్పించడంలో వినియోగించే ప్రమాణాలు, నిబంధనల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అంశాల్లో అల్గారిథమ్​లను వినియోగిస్తున్నామన్న పేరుతో చాలాకాలంగా పరిశీలించడం మానేశాయి. అయితే సామాజిక దిగ్గజాలు ఉపయోగించే అల్గారిథమ్​లు వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ సాంకేతికతను పరిశీలించాలని పేర్కొంటున్నారు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్.

"సామాజిక మాధ్యమాల నియంత్రణ విధానంలో చాలా తీవ్ర సమస్యలున్నాయి. భారత రాజ్యాంగం వ్యక్తులకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. అయితే ఆర్టికల్ 19(2) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని ప్రత్యేక పరిమితులు మాత్రమే ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా ట్విట్టర్​ వంటి సామాజిక మాధ్యమాలు ఏ పోస్ట్​కు అయినా ప్రాచుర్యం కల్పించేందుకు.. అణిచిపెట్టి ఉంచేందుకు ఉపకరించే సాంకేతికతను కలిగి ఉన్నాయి."

-రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ, రాజ్యసభ

సాంకేతికతకూ పక్షపాతం..

సామాజిక మాధ్యమాలు ఉపయోగించే సాంకేతకతకు విశ్వసనీయత ఉండాలని అభిప్రాయపడ్డారు రాజీవ్. సామాజిక మాధ్యమాలు ఉపయోగించే ప్రమాణాల్లో పారదర్శకత లేదని ఆయన గత కొంతకాలంగా వాదిస్తున్నారు. వ్యక్తులు పెట్టే పోస్ట్​లను విశ్లేషించి ఆటోమేటిక్​గా అనుమతించకపోవడంపై అభ్యంతరం లేవనెత్తారు రాజీవ్. ఇందులో సామాజిక మాధ్యమాల పాత్ర ఏమీ లేదని వాదించడం సరికాదన్నారు. సాంకేతికతను తయారుచేసింది మనుషులేనని పేర్కొన్నారు. మనుషులకు పక్షపాతం ఉన్నప్పుడు సాంకేతికతకు కూడా పక్షపాతం ఉంటుందని చెప్పుకొచ్చారు.

నియంత్రణ పరిధిలోకి తేవాల్సిందే..

సామాజిక మాధ్యమ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్​డ్ ఇన్ వంటి సంస్థలు ఉపయోగిస్తున్న సాఫ్ట్​వేర్లను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు రాజీవ్.

రాజకీయ శక్తులతో సంబంధాలు.. సరికాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. కొన్ని సామాజిక మాధ్యమాల సంస్థలు.. వ్యవస్థాపకులకు అనువైన సిద్ధాంతానికి అనుగుణంగా పక్షపాతం చూపుతున్నాయన్న అభిప్రాయాన్ని బలపరుస్తోందన్నారు. ప్రజలు సామాజిక దిగ్గజాలను నవీన ఆవిష్కరణలు, ఏ విధమైన ఆంక్షలు లేనివని విశ్వసిస్తున్న సందర్భంలో.. కొన్ని రాజకీయ శక్తులతో కలిసి పనిచేయడం సరికాదని చెప్పుకొచ్చారు రాజీవ్. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలను పోస్ట్​ చేయడమూ సరియైన విధానం కాదన్నారు.

ఇదీ చూడండి: మోదీ 'జీవిత చరిత్ర'పై కొత్త పుస్తకం విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.