ETV Bharat / bharat

ముంబయి 'తాజ్​ హోటల్'​ ఉద్యోగులకు కరోనా పాజిటివ్​

author img

By

Published : Apr 12, 2020, 6:53 AM IST

ముంబయి తాజ్​మహల్​ ప్యాలెస్, టవర్స్​ హోటల్స్​కు​ చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు ప్రకటించారు. వీరందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

Six Taj hotel employees test positive for coronavirus
ముంబయి 'తాజ్​ హోటల్'​ ఉద్యోగులకు కరోనా పాజిటివ్​

దేశంలో కరోనా కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ముంబయి కొలాబాలోని ప్రఖ్యాత తాజ్​మహల్​ ప్యాలెస్​, టవర్స్ హోటల్​కు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బందికి వైరస్ సోకటం వాస్తవమేనని తెలిపిన తాజ్​ హోటల్​ నిర్వాహకులైన ఇండియన్​ హోటల్స్ కంపెనీ.. వారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.

" మా సిబ్బందికి వైరస్​ లక్షణాలు కనిపించిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాం. వారితో చనువుగా ఉన్న మిగిలిన వారిని కూడానిర్బంధ కేంద్రాలకు పంపించాం. మా హోటల్​లో ప్రస్తుతం అతిథులెవరూ లేరు. కేవలం హోటల్​ నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు.

- ఇండియన్​ హోటల్స్​ కంపెనీ​ ప్రకటన

'కరోనా పాజిటివ్​ వచ్చిన ఆరుగురు తాజ్​ ఉద్యోగులు ముంబయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది' అని ముంబయి ఆసుపత్రికి చెందిన డాక్టర్​ గౌతమ్​ బన్సాలీ తెలిపారు.

దేశంలో కరోనా కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ముంబయి కొలాబాలోని ప్రఖ్యాత తాజ్​మహల్​ ప్యాలెస్​, టవర్స్ హోటల్​కు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బందికి వైరస్ సోకటం వాస్తవమేనని తెలిపిన తాజ్​ హోటల్​ నిర్వాహకులైన ఇండియన్​ హోటల్స్ కంపెనీ.. వారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.

" మా సిబ్బందికి వైరస్​ లక్షణాలు కనిపించిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాం. వారితో చనువుగా ఉన్న మిగిలిన వారిని కూడానిర్బంధ కేంద్రాలకు పంపించాం. మా హోటల్​లో ప్రస్తుతం అతిథులెవరూ లేరు. కేవలం హోటల్​ నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు.

- ఇండియన్​ హోటల్స్​ కంపెనీ​ ప్రకటన

'కరోనా పాజిటివ్​ వచ్చిన ఆరుగురు తాజ్​ ఉద్యోగులు ముంబయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది' అని ముంబయి ఆసుపత్రికి చెందిన డాక్టర్​ గౌతమ్​ బన్సాలీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.