ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో కారు వేగంగా వచ్చి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అసలు ఏం జరిగింది...
జగదల్పుర్లోని గీదామ్-బార్సూర్ మార్గంలో 11 మంది విహార యాత్ర కోసం జార్సూర్కు వచ్చారు. బార్సూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వేగంగా రావటం వల్ల కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:బంగాల్లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట