ETV Bharat / bharat

'మాకు హడావుడి లేదు.. ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్'

ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉందని సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పష్టం చేశారు. వ్యాక్సిన్​ను హడావుడిగా తయారు చేయడం లేదని.. భద్రత, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు టెస్టింగ్ కిట్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు.

author img

By

Published : Jul 7, 2020, 7:04 PM IST

Serum Institute of India expects COVID vaccine by year-end
'మాకు హడావుడి లేదు- ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్'

సురక్షితమైన కరోనా వ్యాక్సిన్​ను ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి చేసేందుకు సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఎలాంటి హడావుడి లేదని పేర్కొన్నారు.

మైల్యాబ్స్​ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన 'కాంపాక్ట్ ఎక్స్​ఎల్' డయాగ్నోస్టిక్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమర్థమంతమైన వ్యాక్సిన్ తయారీపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.

"సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ రూపొందిస్తామని మేము ఆశిస్తున్నాం. మూడో దశ ట్రయల్స్ గురించి ఓసారి చర్చిస్తాం. ఎవరో వ్యాక్సిన్​ను హడావుడిగా తయారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మాకు ఎలాంటి హడావుడి లేదు. భద్రత, సమర్థతకు మేం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. సురక్షితమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన నమ్మకం మాకు కలిగితే తప్పకుండా దాని గురించి ప్రకటిస్తాం. కానీ దానికి ఆరు నెలల సమయం ఉంది."

-అదర్ పూనావాలా, సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మైల్యాబ్స్​లో ఎస్​ఐఐ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. భారత్​లో సరిపడా పరీక్షలు జరగడం లేదని అన్నారు. కేసులు పెరుగుతాయన్న భయం ఉండకూడదని సూచించారు.

ఓకే అంటే ఎగుమతి చేస్తాం..!

మైల్యాబ్స్​ సహా ఇతర సంస్థలు తమ ఉత్పత్తి (టెస్టింగ్ కిట్ల) సామర్థ్యాలను ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాయని అన్నారు పూనావాలా. వారానికి 20 లక్షల టెస్టింగ్ కిట్లను మైల్యాబ్స్ తయారు చేస్తోందని తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన కిట్లు నిల్వచేసిన తర్వాత.. విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

ఇదీ చదవండి- 'దలైలామాకు ఆతిథ్యమిస్తున్న భారత్​కు కృతజ్ఞతలు'

సురక్షితమైన కరోనా వ్యాక్సిన్​ను ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి చేసేందుకు సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఎలాంటి హడావుడి లేదని పేర్కొన్నారు.

మైల్యాబ్స్​ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన 'కాంపాక్ట్ ఎక్స్​ఎల్' డయాగ్నోస్టిక్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమర్థమంతమైన వ్యాక్సిన్ తయారీపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.

"సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ రూపొందిస్తామని మేము ఆశిస్తున్నాం. మూడో దశ ట్రయల్స్ గురించి ఓసారి చర్చిస్తాం. ఎవరో వ్యాక్సిన్​ను హడావుడిగా తయారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మాకు ఎలాంటి హడావుడి లేదు. భద్రత, సమర్థతకు మేం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. సురక్షితమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన నమ్మకం మాకు కలిగితే తప్పకుండా దాని గురించి ప్రకటిస్తాం. కానీ దానికి ఆరు నెలల సమయం ఉంది."

-అదర్ పూనావాలా, సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మైల్యాబ్స్​లో ఎస్​ఐఐ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. భారత్​లో సరిపడా పరీక్షలు జరగడం లేదని అన్నారు. కేసులు పెరుగుతాయన్న భయం ఉండకూడదని సూచించారు.

ఓకే అంటే ఎగుమతి చేస్తాం..!

మైల్యాబ్స్​ సహా ఇతర సంస్థలు తమ ఉత్పత్తి (టెస్టింగ్ కిట్ల) సామర్థ్యాలను ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాయని అన్నారు పూనావాలా. వారానికి 20 లక్షల టెస్టింగ్ కిట్లను మైల్యాబ్స్ తయారు చేస్తోందని తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన కిట్లు నిల్వచేసిన తర్వాత.. విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

ఇదీ చదవండి- 'దలైలామాకు ఆతిథ్యమిస్తున్న భారత్​కు కృతజ్ఞతలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.