ETV Bharat / bharat

ఇరాన్​ నుంచి స్వదేశానికి మరో 44 మంది

author img

By

Published : Mar 13, 2020, 5:39 PM IST

Updated : Mar 13, 2020, 9:11 PM IST

కరోనా భయాల నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకున్న మరికొంత మంది యాత్రికులను స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం. రెండో విడతలో భాగంగా 44 మంది పౌరులతో కూడిన ప్రత్యేక విమానం భారత్​కు చేరుకుంది.

44 Indian pilgrims arrived from Iran
భారత్​కు చేరిన మరో 44 మంది భారత్​కు రాక
ఇరాన్​ నుంచి స్వదేశానికి చేరిన మరో 44 మంది సందర్శకులు

కొవిడ్​-19 (కరోనా) వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే వైరస్​ వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల నుంచి తమ పౌరులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకున్న మరికొంత మంది యాత్రికులను స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం.

నేడు రెండో విడతలో 44 మంది యాత్రికులు ప్రత్యేక విమానం ద్వారా ముంబయి విమానాశ్రయానికి చేరినట్లు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ తెలిపారు.

'ఇరాన్​లో భారత వైద్య బృందం చక్కగా పనిచేస్తోంది. ఈ విషయంలో మద్దతుగా నిలిచిన ఇరాన్​ అధికారులు, విమానయాన సంస్థకు అభినందనలు.'

- జయ్​శంకర్​, భారత విదేశాంగ మంత్రి

తొలి బృందంలో 58 మంది..

కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇరాన్​ ఒకటి.​ ఇప్పటికే తొలి బృందంలో 58 మంది భారత సందర్శకులను స్వదేశానికి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇరాన్​లో సుమారు 6 వేల మంది భారతీయులు ఉన్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ తెలిపింది​. వారందరినీ సురక్షితంగా భారత్​కు తీసుకురావడమే తమ కర్తవ్యమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. త్వరలోనే మరో 120 మంది ప్రయాణికులను భారత్​కు తీసుకురానున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా విజృంభణతో 'భారత్​ బంద్​' తరహా పరిస్థితి!

ఇరాన్​ నుంచి స్వదేశానికి చేరిన మరో 44 మంది సందర్శకులు

కొవిడ్​-19 (కరోనా) వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే వైరస్​ వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల నుంచి తమ పౌరులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకున్న మరికొంత మంది యాత్రికులను స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం.

నేడు రెండో విడతలో 44 మంది యాత్రికులు ప్రత్యేక విమానం ద్వారా ముంబయి విమానాశ్రయానికి చేరినట్లు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ తెలిపారు.

'ఇరాన్​లో భారత వైద్య బృందం చక్కగా పనిచేస్తోంది. ఈ విషయంలో మద్దతుగా నిలిచిన ఇరాన్​ అధికారులు, విమానయాన సంస్థకు అభినందనలు.'

- జయ్​శంకర్​, భారత విదేశాంగ మంత్రి

తొలి బృందంలో 58 మంది..

కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇరాన్​ ఒకటి.​ ఇప్పటికే తొలి బృందంలో 58 మంది భారత సందర్శకులను స్వదేశానికి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇరాన్​లో సుమారు 6 వేల మంది భారతీయులు ఉన్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ తెలిపింది​. వారందరినీ సురక్షితంగా భారత్​కు తీసుకురావడమే తమ కర్తవ్యమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. త్వరలోనే మరో 120 మంది ప్రయాణికులను భారత్​కు తీసుకురానున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా విజృంభణతో 'భారత్​ బంద్​' తరహా పరిస్థితి!

Last Updated : Mar 13, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.