ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్ కోసం పోరాటం కొనసాగుతుంది: ముఫ్తీ

author img

By

Published : Oct 14, 2020, 3:21 PM IST

పద్నాలుగు నెలల నిర్బంధం నుంచి విడుదలైన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రంపై మాటల దాడి చేశారు. జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టులో కేంద్రం తీసుకున్న నిర్ణయం బాధించిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Mehbooba Mufti
ముఫ్తీ

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.. నిర్బంధం నుంచి విడుదలైన వెంటనే అధికరణ 370 రద్దుపై విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు ముఫ్తీ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం 'బ్లాక్‌ డే' నాడు 'బ్లాక్‌ డెసిషన్‌' తీసుకుందని ఆమె ట్వీట్​ చేశారు.

"14 నెలల తర్వాత నేను నిర్బంధం నుంచి విడుదలయ్యాను. 2019 ఆగస్టులో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఇన్ని రోజులైనా నా గుండెలపై దాడి చేస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్ ప్రజల పరిస్థితీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఆ రోజు జరిగిందాన్ని ఎవరూ మర్చిపోలేరు. మనం పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవాలి. కశ్మీర్ కోసం మన పోరాటాన్ని కొనసాగించాలి. అదంత సులభం కాదని నాకు తెలుసు."

- మెహబూబా ముఫ్తీ

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయానికి కొన్ని గంటల ముందు ముఫ్తీని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెపై కఠినమైన 'ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ)' కింద అభియోగాలు మోపారు. నిర్బంధాన్ని పొడిగించారు. ఎనిమిది నెలలపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనే ఆమెను ఉంచారు.

అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 7న తన అధికారిక నివాసానికి మార్చి.. గృహ నిర్బంధంలోనే ఉంచారు. అయితే ముఫ్తీ నిర్బంధంపై ఆమె కుమార్తె ఇల్తిజా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. చివరగా దానిపై గత నెల 29న సర్వోన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. చివరికి అక్టోబర్​ 13న ముఫ్తీని విడుదల చేశారు.

ఇదీ చూడండి: నిర్బంధం నుంచి పీడీపీ చీఫ్ ముఫ్తీ విడుదల

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.. నిర్బంధం నుంచి విడుదలైన వెంటనే అధికరణ 370 రద్దుపై విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు ముఫ్తీ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం 'బ్లాక్‌ డే' నాడు 'బ్లాక్‌ డెసిషన్‌' తీసుకుందని ఆమె ట్వీట్​ చేశారు.

"14 నెలల తర్వాత నేను నిర్బంధం నుంచి విడుదలయ్యాను. 2019 ఆగస్టులో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఇన్ని రోజులైనా నా గుండెలపై దాడి చేస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్ ప్రజల పరిస్థితీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఆ రోజు జరిగిందాన్ని ఎవరూ మర్చిపోలేరు. మనం పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవాలి. కశ్మీర్ కోసం మన పోరాటాన్ని కొనసాగించాలి. అదంత సులభం కాదని నాకు తెలుసు."

- మెహబూబా ముఫ్తీ

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయానికి కొన్ని గంటల ముందు ముఫ్తీని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెపై కఠినమైన 'ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ)' కింద అభియోగాలు మోపారు. నిర్బంధాన్ని పొడిగించారు. ఎనిమిది నెలలపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనే ఆమెను ఉంచారు.

అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 7న తన అధికారిక నివాసానికి మార్చి.. గృహ నిర్బంధంలోనే ఉంచారు. అయితే ముఫ్తీ నిర్బంధంపై ఆమె కుమార్తె ఇల్తిజా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. చివరగా దానిపై గత నెల 29న సర్వోన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. చివరికి అక్టోబర్​ 13న ముఫ్తీని విడుదల చేశారు.

ఇదీ చూడండి: నిర్బంధం నుంచి పీడీపీ చీఫ్ ముఫ్తీ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.