ETV Bharat / bharat

స్కూళ్లు తెరవడంపై ఏ రాష్ట్రం ఏమంటోంది?

author img

By

Published : Oct 11, 2020, 3:58 PM IST

ఈ నెల 15 తర్వాత స్కూళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కానీ అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇందుకు విముఖంగా ఉన్నాయి. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెబుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు జాగ్రత్తలతో పాఠశాలలను తెరుస్తున్నాయి. మరి ఈ అంశంపై ఏ రాష్ట్రం ఏమంటోంది?

Schools reopening: Many states unsure, yet to decide in view of COVID-19 situation
స్కూళ్లు తెరవడంపై ఏ రాష్ట్రం ఏమంటోంది?

అన్​లాక్​ 5.0లో భాగంగా ఈ నెల 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. అయితే రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఇప్పట్లో పాఠశాలలను తెరవకూడదని పలు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని సందిగ్ధంలో పడ్డాయి. ఇంకొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తలతో పాఠశాలలను తెరిచేందుకు సన్నద్ధమయ్యాయి. మరి స్కూళ్లను తెరిచే విషయంలో ఏ రాష్ట్రం ఏమంటోంది?

దిల్లీ:-

  • ఈ నెల 31వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయి.
  • పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఉత్తర్​ప్రదేశ్​:-

  • కంటైన్​మెంట్​ జోన్లు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 9-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తెరుచుకుంటాయి.
  • షిఫ్టులవారీగా తరగతులు నిర్వహిస్తారు. తల్లిదండ్రులిచ్చిన అనుమతి పత్రాన్ని చూపిస్తేనే క్లాసుల్లోకి ప్రవేశం ఉంటుంది.

కర్ణాటక:-

  • స్కుళ్లు తెరిచేందుకు ప్రభుత్వం విముఖంగా ఉంది. పిల్లల ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టం చేసింది.
  • పరిస్థితులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.

మహారాష్ట్ర:-

  • వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో దీపావళి వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయి.
  • ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే పరిస్థితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటారు.

బంగాల్​:-

  • నవంబర్​ మధ్య వారం తర్వాతే స్కూళ్లను తెరిచే విషయాన్ని పరిశీలించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది.

వీటితో పాటు గుజరాత్​, ఛత్తీస్​గఢ్​, ఆంధ్రప్రదేశ్​, ప్రభుత్వాలు పాఠశాలలను తెరవకూడదని నిర్ణయం తీసుకున్నాయి. అయితే పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి.. 9-12 తరగతుల వారికి స్కూళ్లను తెరిచింది.

ఇదీ చూడండి- స్ఫూర్తి: ఎదురీత ముందు విధిరాత ఎంత?

అన్​లాక్​ 5.0లో భాగంగా ఈ నెల 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. అయితే రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఇప్పట్లో పాఠశాలలను తెరవకూడదని పలు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని సందిగ్ధంలో పడ్డాయి. ఇంకొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తలతో పాఠశాలలను తెరిచేందుకు సన్నద్ధమయ్యాయి. మరి స్కూళ్లను తెరిచే విషయంలో ఏ రాష్ట్రం ఏమంటోంది?

దిల్లీ:-

  • ఈ నెల 31వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయి.
  • పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఉత్తర్​ప్రదేశ్​:-

  • కంటైన్​మెంట్​ జోన్లు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 9-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తెరుచుకుంటాయి.
  • షిఫ్టులవారీగా తరగతులు నిర్వహిస్తారు. తల్లిదండ్రులిచ్చిన అనుమతి పత్రాన్ని చూపిస్తేనే క్లాసుల్లోకి ప్రవేశం ఉంటుంది.

కర్ణాటక:-

  • స్కుళ్లు తెరిచేందుకు ప్రభుత్వం విముఖంగా ఉంది. పిల్లల ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టం చేసింది.
  • పరిస్థితులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.

మహారాష్ట్ర:-

  • వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో దీపావళి వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయి.
  • ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే పరిస్థితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటారు.

బంగాల్​:-

  • నవంబర్​ మధ్య వారం తర్వాతే స్కూళ్లను తెరిచే విషయాన్ని పరిశీలించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది.

వీటితో పాటు గుజరాత్​, ఛత్తీస్​గఢ్​, ఆంధ్రప్రదేశ్​, ప్రభుత్వాలు పాఠశాలలను తెరవకూడదని నిర్ణయం తీసుకున్నాయి. అయితే పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి.. 9-12 తరగతుల వారికి స్కూళ్లను తెరిచింది.

ఇదీ చూడండి- స్ఫూర్తి: ఎదురీత ముందు విధిరాత ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.