ETV Bharat / bharat

7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు

7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ. లక్ష వరకు జరిమానా విధించింది. మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుపై తమ స్పందన తెలియజేయాలని గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి రూ. 50 వేలు జరిమానా పడింది.

author img

By

Published : Aug 13, 2019, 7:33 PM IST

Updated : Sep 26, 2019, 9:48 PM IST

7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు

ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని 2018 జనవరి 4న సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని 7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ.లక్ష వరకు జరిమానా విధించింది.

మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. ఏఏ రాష్ట్రాలు ఈ అంశంపై తమ స్పందనలు తెలియజేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ఇవ్వలేదని తెలుసుకున్న ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాల లోపు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.

ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని 2018 జనవరి 4న సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని 7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ.లక్ష వరకు జరిమానా విధించింది.

మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. ఏఏ రాష్ట్రాలు ఈ అంశంపై తమ స్పందనలు తెలియజేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ఇవ్వలేదని తెలుసుకున్న ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాల లోపు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.

Tirunelveli (Tamil Nadu), Aug 13 (ANI): An elderly couple showed courage and fought off two armed robbers who barged into the entrance of their house in Tamil Nadu's Tirunelveli. One of the robbers also tried to strangle the man. The incident took place on the night of August 11.
Last Updated : Sep 26, 2019, 9:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.