ETV Bharat / bharat

'కొవిడ్​ చికిత్సకు ఆయుర్వేద పద్ధతులా?'

author img

By

Published : Nov 19, 2020, 6:59 PM IST

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసమే ఆయుర్వేద మందులను వాడాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొవిడ్​ చికిత్సలో ఆయుర్వేద పద్ధతులకు ఏ ప్రాతిపదికన అనుమతించారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది సుప్రీం.

SC seeks Centre's response on usage of alternative medicine to treat COVID
'కొవిడ్​ చికిత్సలో ఆయుర్వేద పద్ధతులు ఎలా?'

ఏ ప్రాతిపదికన.. కొవిడ్​ చికిత్సకు ఆయుర్వేద పద్ధతులకు అనుమతించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని ఆదేశించింది. కొవిడ్​ చికిత్స విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

అంతకుముందు.. రోగ నిరోధక శక్తిని అందించేందుకు మాత్రమే ఆయుర్వేద మందులను వినియోగించాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా చికిత్సకు కాదని స్పష్టం చేసింది. దీనిని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయుష్​ వైద్యులు. జస్టిస్​ అశోక్​ భూషన్, జస్టిస్​ ఆర్​ సుభాష్​ రెడ్డి, జస్టిస్​ ఎమ్​ఆర్​ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది. ఆయుర్వేద మందులను వినియోగించడంపై ఏమైనా మార్గదర్శకాలు జారీ చేశారా? అని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాను ప్రశ్నించింది సుప్రీం.

దీనిపై స్పందించిన సొలిసిటర్​ జనరల్​... రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే ఆయిర్వేద మందులను వాడతామని నివేదించారు. అయితే.. ఈ విషయంలో మార్గదర్శకాలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది ధర్మాసనం.

ఇదీ చూడండి:'సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి'

ఏ ప్రాతిపదికన.. కొవిడ్​ చికిత్సకు ఆయుర్వేద పద్ధతులకు అనుమతించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని ఆదేశించింది. కొవిడ్​ చికిత్స విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

అంతకుముందు.. రోగ నిరోధక శక్తిని అందించేందుకు మాత్రమే ఆయుర్వేద మందులను వినియోగించాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా చికిత్సకు కాదని స్పష్టం చేసింది. దీనిని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయుష్​ వైద్యులు. జస్టిస్​ అశోక్​ భూషన్, జస్టిస్​ ఆర్​ సుభాష్​ రెడ్డి, జస్టిస్​ ఎమ్​ఆర్​ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది. ఆయుర్వేద మందులను వినియోగించడంపై ఏమైనా మార్గదర్శకాలు జారీ చేశారా? అని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాను ప్రశ్నించింది సుప్రీం.

దీనిపై స్పందించిన సొలిసిటర్​ జనరల్​... రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే ఆయిర్వేద మందులను వాడతామని నివేదించారు. అయితే.. ఈ విషయంలో మార్గదర్శకాలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది ధర్మాసనం.

ఇదీ చూడండి:'సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.