ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

author img

By

Published : Jun 26, 2020, 11:20 AM IST

Updated : Jun 26, 2020, 12:35 PM IST

SC permits CBSE
10,12వ తరగతి సీబీఎస్​ఈ పరీక్షల రద్దు​కు సుప్రీం అనుమతి

11:14 June 26

సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

జులైలో జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్​ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది.

జులై 15నాటికి ఫలితాలు..

జులై 15నాటికి 10,12వ తరగతి విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ బోర్డులు కోర్టుకు తెలిపాయి. ఫలితాల పట్ల సంతృప్తి చెందని 12వ తరగతి విద్యార్థులకు కావాలంటే తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ అధికారి భరద్వాజ్​ తెలిపారు.  చివరగా ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

10వ తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది సీబీఎస్ఈ. గత మూడు బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయిస్తామని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు గురువారం తెలియజేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయాలని వినతి చేసింది.

11:14 June 26

సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

జులైలో జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్​ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది.

జులై 15నాటికి ఫలితాలు..

జులై 15నాటికి 10,12వ తరగతి విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ బోర్డులు కోర్టుకు తెలిపాయి. ఫలితాల పట్ల సంతృప్తి చెందని 12వ తరగతి విద్యార్థులకు కావాలంటే తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ అధికారి భరద్వాజ్​ తెలిపారు.  చివరగా ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

10వ తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది సీబీఎస్ఈ. గత మూడు బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయిస్తామని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు గురువారం తెలియజేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయాలని వినతి చేసింది.

Last Updated : Jun 26, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.