ETV Bharat / bharat

'కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'

author img

By

Published : Sep 16, 2019, 12:20 PM IST

Updated : Sep 30, 2019, 7:35 PM IST

జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్​లో సత్వరమే సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ అధికారులను ఆదేశించింది సుప్రీం కోర్టు. అధికరణ 370 రద్దు, ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనల అనంతరం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు
'కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు, కశ్మీర్​లో ఆంక్షలు, సమాచార వ్యవస్థ స్తంభనపై దాఖలైన అన్ని రకాల పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్​లో క్రమపద్ధతిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సత్వరం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ అధికారులను ఆదేశించింది.

లోయలో జనజీవనాన్ని సాధారణ స్థితికి రావడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

సమాచార వ్యవస్థ స్తంభన అనేది కశ్మీర్​లోయలోనే ఉన్నందున ఈ అంశాన్ని జమ్ముకశ్మీర్​ హైకోర్టు పరిశీలిస్తుందని అభిప్రాయపడింది ధర్మాసనం. జమ్ముకశ్మీర్​లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు ఎత్తివేయాలని కశ్మీర్​ టైమ్స్​ ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ అనురాధ భాసిన్​ దాఖలు చేసిన పిటిషన్​ మేరకు ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు.

అధికరణ 370 రద్దు చేసినప్పటి నుంచి ఒక్క తూటా పేల్చకుండా చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉన్నాయని.. 88 శాతం పోలీస్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఎత్తివేశామని తెలిపారు. కశ్మీర్​లో ప్రచురితమయ్యే అన్ని వార్తాపత్రికలు నడుస్తున్నాయని.. అందుకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామన్నారు. వాటితో పాటు దూరదర్శన్​, ఇతర ప్రైవేటు టీవీ ఛానళ్ల, ఎఫ్​ఎం నెట్​​వర్క్​లు పనిచేస్తున్నట్లు తెలిపారు.

అఫిడవిట్​ దాఖలుకు ఆదేశం..

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్​ దాఖలు చేయాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

కశ్మీర్​లో పర్యటిస్తా...

కశ్మీరీ ప్రజలు హైకోర్టును ఆశ్రయించలేకపోతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నివేదిక సమర్పించాలని జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అలాంటి పరిస్థితులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు జస్టిస్​ గొగొయి. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే తాను శ్రీనగర్​లో పర్యటిస్తానని తెలిపారు. ఈ వాదనలకు నివేదిక విరుద్ధంగా వస్తే దాని పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోపణలు చేసిన న్యాయవాదిని హెచ్చరించారు.

ఆజాద్​కు అనుమతి...

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​కు శ్రీనగర్​, బారముల్లా, అనంతనాగ్​, జమ్ము జిల్లాల్లో పర్యటించేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ప్రజలను కలిసి వారి సంక్షేమం గురించి తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ పర్యటనలో ఎలాంటి ప్రసంగాలు చేయకూడదని, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

వైగో వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు..

జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాను కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్న ఎండీఎంకే అధినేత వైగో వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్ము ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 30లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

ఆర్టికల్​ 370 రద్దును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

'కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు, కశ్మీర్​లో ఆంక్షలు, సమాచార వ్యవస్థ స్తంభనపై దాఖలైన అన్ని రకాల పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్​లో క్రమపద్ధతిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సత్వరం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ అధికారులను ఆదేశించింది.

లోయలో జనజీవనాన్ని సాధారణ స్థితికి రావడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

సమాచార వ్యవస్థ స్తంభన అనేది కశ్మీర్​లోయలోనే ఉన్నందున ఈ అంశాన్ని జమ్ముకశ్మీర్​ హైకోర్టు పరిశీలిస్తుందని అభిప్రాయపడింది ధర్మాసనం. జమ్ముకశ్మీర్​లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు ఎత్తివేయాలని కశ్మీర్​ టైమ్స్​ ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ అనురాధ భాసిన్​ దాఖలు చేసిన పిటిషన్​ మేరకు ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు.

అధికరణ 370 రద్దు చేసినప్పటి నుంచి ఒక్క తూటా పేల్చకుండా చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉన్నాయని.. 88 శాతం పోలీస్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఎత్తివేశామని తెలిపారు. కశ్మీర్​లో ప్రచురితమయ్యే అన్ని వార్తాపత్రికలు నడుస్తున్నాయని.. అందుకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామన్నారు. వాటితో పాటు దూరదర్శన్​, ఇతర ప్రైవేటు టీవీ ఛానళ్ల, ఎఫ్​ఎం నెట్​​వర్క్​లు పనిచేస్తున్నట్లు తెలిపారు.

అఫిడవిట్​ దాఖలుకు ఆదేశం..

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్​ దాఖలు చేయాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

కశ్మీర్​లో పర్యటిస్తా...

కశ్మీరీ ప్రజలు హైకోర్టును ఆశ్రయించలేకపోతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నివేదిక సమర్పించాలని జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అలాంటి పరిస్థితులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు జస్టిస్​ గొగొయి. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే తాను శ్రీనగర్​లో పర్యటిస్తానని తెలిపారు. ఈ వాదనలకు నివేదిక విరుద్ధంగా వస్తే దాని పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోపణలు చేసిన న్యాయవాదిని హెచ్చరించారు.

ఆజాద్​కు అనుమతి...

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​కు శ్రీనగర్​, బారముల్లా, అనంతనాగ్​, జమ్ము జిల్లాల్లో పర్యటించేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ప్రజలను కలిసి వారి సంక్షేమం గురించి తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ పర్యటనలో ఎలాంటి ప్రసంగాలు చేయకూడదని, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

వైగో వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు..

జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాను కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్న ఎండీఎంకే అధినేత వైగో వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్ము ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 30లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

ఆర్టికల్​ 370 రద్దును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

New Delhi, Sep 16 (ANI): Defence expert SP Sinha on September 16 shared his views on over 2050 incidents of unprovoked ceasefire violation by Pakistan in 2019 in which 21 Indians lost their lives. He said that Pakistan is totally obsessed with India and Jihad and infiltrating terrorists inside India is its only objective. He added that the Indian Army and security forces are capable enough to neutralise any infiltrator. Recently, Ministry of External Affairs highlighted the concerns of 'unprovoked ceasefire violation,' 'cross border infiltration' and 'targeting of Indian civilians.'

Last Updated : Sep 30, 2019, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.