ETV Bharat / bharat

స్పృహలోకి శశికళ- ఆరోగ్యం మెరుగు

author img

By

Published : Jan 22, 2021, 8:25 PM IST

తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం కాస్త కుదుటపడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని వెల్లడించాయి.

Sasikala is conscious and well-oriented, her pulse rate is 67/minute & blood pressure is 126/60mm: BMCRI
మెరుగుపడిన శశికళ ఆరోగ్యం: వైద్య వర్గాలు

తీవ్ర అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ఆమె స్పృహలోకి రావడం సహా.. వైద్యానికి సహకరిస్తున్నారని పేర్కొన్నాయి. ఆమె పల్స్​ రేటు నిమిషానికి 67, బీపీ 126/60మిల్లీ మీటర్లుగా ఉన్నాయని వెల్లడించారు వైద్యులు.

అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇంతలో వెన్నునొప్పి, శ్వాసకోశ వ్యాధులు ఆమెను ఇబ్బంది పెట్టాయి. దీంతో గురువారం కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మెడికల్​ కాలేజ్​, రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​లో చికిత్స పొందుతున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ఆమె స్పృహలోకి రావడం సహా.. వైద్యానికి సహకరిస్తున్నారని పేర్కొన్నాయి. ఆమె పల్స్​ రేటు నిమిషానికి 67, బీపీ 126/60మిల్లీ మీటర్లుగా ఉన్నాయని వెల్లడించారు వైద్యులు.

అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇంతలో వెన్నునొప్పి, శ్వాసకోశ వ్యాధులు ఆమెను ఇబ్బంది పెట్టాయి. దీంతో గురువారం కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మెడికల్​ కాలేజ్​, రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: కమల్​ డిశ్ఛార్జ్- ఎన్నికల ప్రచారం ఇప్పట్లో కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.