ETV Bharat / bharat

7 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయం

author img

By

Published : Oct 16, 2020, 8:54 PM IST

ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. దాదాపు ఏడు నెలల తర్వాత తెరుచుకుంది. ఇవాళ అయ్యప్ప సన్నిధిలో తులమాస పూజ నిర్వహించారు. అక్టోబర్​ 17 నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

Sabarimala temple
7 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయం

నెలవారీ ఐదురోజుల పూజా కార్యక్రమం కోసం శబరిమల దేవస్థానం అక్టోబర్​ 16న తెరుచుకుంది. దాదాపు 7 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచారు. అక్టోబర్​ 17 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

కరోనా టెస్టు పక్కా..

భక్తులు పంబా చేరుకోవడానికి 48 గంటల ముందే కరోనా టెస్టు చేయించుకోవాలి. నిలక్కల్​ ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్​ కేంద్రంలోనూ పరీక్షలు చేస్తారు. నెగెటివ్​ వస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు 250 మంది భక్తులకే ఈ అవకాశం రానుంది. సన్నిదానం చేరడానికి వర్చువల్​ క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటుంది.

స్వామి అయ్యప్పన్​ రోడ్డు మార్గం నుంచి మాత్రమే సన్నిధానానికి అనుమతి ఇస్తున్నారు. అడవుల దారి నుంచి నో ఎంట్రీ ప్రకటించింది దేవస్థానం బోర్డు. కరోనా నేపథ్యంలో మాస్క్​లు ధరించి, కొండమార్గాల్లో చేరుకోవడం భక్తులకు ఇబ్బందిగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకుంది. అభిషేకం కోసం నెయ్యిని సమర్పించే భక్తులు.. ప్రత్యేక కౌంటర్​లో అందజేయాల్సి ఉంటుంది. ప్రసాదాన్ని కూడా అక్కడే ఇవ్వనున్నారు.

పూజలు చేసిన అర్చకులు

నెలవారీ ఐదురోజుల పూజా కార్యక్రమం కోసం శబరిమల దేవస్థానం అక్టోబర్​ 16న తెరుచుకుంది. దాదాపు 7 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచారు. అక్టోబర్​ 17 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

కరోనా టెస్టు పక్కా..

భక్తులు పంబా చేరుకోవడానికి 48 గంటల ముందే కరోనా టెస్టు చేయించుకోవాలి. నిలక్కల్​ ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్​ కేంద్రంలోనూ పరీక్షలు చేస్తారు. నెగెటివ్​ వస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు 250 మంది భక్తులకే ఈ అవకాశం రానుంది. సన్నిదానం చేరడానికి వర్చువల్​ క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటుంది.

స్వామి అయ్యప్పన్​ రోడ్డు మార్గం నుంచి మాత్రమే సన్నిధానానికి అనుమతి ఇస్తున్నారు. అడవుల దారి నుంచి నో ఎంట్రీ ప్రకటించింది దేవస్థానం బోర్డు. కరోనా నేపథ్యంలో మాస్క్​లు ధరించి, కొండమార్గాల్లో చేరుకోవడం భక్తులకు ఇబ్బందిగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకుంది. అభిషేకం కోసం నెయ్యిని సమర్పించే భక్తులు.. ప్రత్యేక కౌంటర్​లో అందజేయాల్సి ఉంటుంది. ప్రసాదాన్ని కూడా అక్కడే ఇవ్వనున్నారు.

పూజలు చేసిన అర్చకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.