ETV Bharat / bharat

"ప్రభుత్వం భేష్....సైన్యానిది అద్భుత జోష్"

ఉత్తర్​ప్రదేశ్​ గాల్వియర్​లో ఆర్​ఎస్​ఎస్​ అఖిల భారతీయ ప్రతినిధుల సభ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల ముందు కీలకాంశాలపై చర్చలు సాగుతున్నాయి.

author img

By

Published : Mar 8, 2019, 6:57 PM IST

Updated : Mar 8, 2019, 7:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్

పాకిస్థాన్​లోని తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత వైమానిక దళంపై ప్రశంసల వర్షం కురిపించింది ఆర్​ఎస్​ఎస్​. మెరుపుదాడులకు అనుమతిస్తూ సరైన నిర్ణయం తీసుకుందంటూ మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.

ఉత్తర్​ప్రదేశ్​ గాల్వియర్​లో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధుల సభ మొదటి రోజు ఈ మేరకు తీర్మానం చేసింది ఆర్​ఎస్​ఎస్​. పాకిస్థాన్​ యుద్ధ విమానాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన అభినందన్​ను ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.

తీవ్రవాదులతో పోరాటానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొంది. భారత ప్రజలు ఇలాంటి దేశ దోహ్రుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. -ఆర్​ఎస్​ఎస్​

భారత దేశ సహనాన్ని చేతకానితనంగా పరిగణించకూడదని హెచ్చరించింది ఆర్​ఎస్​ఎస్​.

శబరిమల వివాదంపై...

శబరిమల వివాదంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అన్యమతస్థులను ఆలయంలోకి పంపి హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని ఆర్​ఎస్​ఎస్​ ఆరోపించింది.

రామ మందిరానికి ఏకాభిప్రాయం:

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్​ఎస్​ఎస్​ ధీమా వ్యక్తంచేసింది.

పర్యావరణ అంశాలపై చర్చ:

ఈ మూడు రోజుల చర్చల్లో రాజకీయ అంశాలతో పాటు పర్యావరణ అంశాలైన నీటి పొదుపు, ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించటం, మొక్కల పెంపకంపై చర్చించనున్నారు.

అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశానికి ఆర్​ఎస్​ఎస్​ అధ్యక్షుడు మోహన్​ భగత్​ సహా 1400 మంది సభ్యులు హజరయ్యారు.

అఖిల భారతీయ ప్రతినిధుల సభ

పాకిస్థాన్​లోని తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత వైమానిక దళంపై ప్రశంసల వర్షం కురిపించింది ఆర్​ఎస్​ఎస్​. మెరుపుదాడులకు అనుమతిస్తూ సరైన నిర్ణయం తీసుకుందంటూ మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.

ఉత్తర్​ప్రదేశ్​ గాల్వియర్​లో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధుల సభ మొదటి రోజు ఈ మేరకు తీర్మానం చేసింది ఆర్​ఎస్​ఎస్​. పాకిస్థాన్​ యుద్ధ విమానాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన అభినందన్​ను ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.

తీవ్రవాదులతో పోరాటానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొంది. భారత ప్రజలు ఇలాంటి దేశ దోహ్రుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. -ఆర్​ఎస్​ఎస్​

భారత దేశ సహనాన్ని చేతకానితనంగా పరిగణించకూడదని హెచ్చరించింది ఆర్​ఎస్​ఎస్​.

శబరిమల వివాదంపై...

శబరిమల వివాదంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అన్యమతస్థులను ఆలయంలోకి పంపి హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని ఆర్​ఎస్​ఎస్​ ఆరోపించింది.

రామ మందిరానికి ఏకాభిప్రాయం:

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్​ఎస్​ఎస్​ ధీమా వ్యక్తంచేసింది.

పర్యావరణ అంశాలపై చర్చ:

ఈ మూడు రోజుల చర్చల్లో రాజకీయ అంశాలతో పాటు పర్యావరణ అంశాలైన నీటి పొదుపు, ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించటం, మొక్కల పెంపకంపై చర్చించనున్నారు.

అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశానికి ఆర్​ఎస్​ఎస్​ అధ్యక్షుడు మోహన్​ భగత్​ సహా 1400 మంది సభ్యులు హజరయ్యారు.


Bikaner (Rajasthan), Mar 08 (ANI): Indian Air Force's (IAF) MiG 21 supersonic jet fighter and interceptor aircraft during a regular mission, the cause of the crash is yet to be ascertained. The plane took off from Nal near Bikaner. The pilot ejected himself safely before crash. This MiG aircraft crashed in Shobhasar ki Dhani, which is 12 km from far from the Bikaner city. Wing Commander Abhinandan Varthaman, was flying a similar MiG 21 aircraft, that shot down a Pakistani F-16 aircraft before crashing.
Last Updated : Mar 8, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.