ETV Bharat / bharat

'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

author img

By

Published : Aug 1, 2019, 4:10 PM IST

Updated : Aug 1, 2019, 7:02 PM IST

బాలీవుడ్​ నటుడు రాహుల్ బోస్​కు రెండు అరటిపండ్లపై రూ. 442ను బిల్లుగా వేసిన సంగతి  గుర్తుందా. ఈ ఘటనను వ్యాపారాస్త్రంగా మలుచుకుంటున్నాయి వాణిజ్య వర్గాలు. రెండు అరటిపండ్ల ధరతో మా సంస్థకు చెందిన విలువైన వస్తువులు వస్తాయని ప్రచారం చేస్తున్నాయి.

'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

సమాజంలో జరిగే సంఘటనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడంలో వాణిజ్య వర్గాలు ముందుంటాయి. ప్రత్యేక సందర్భాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకూ ప్రచారాన్ని చేసేవి. తాజాగా ఓ అడుగు ముందుకేశాయి.

బాలీవుడ్ నటుడు రాహుల్‌ బోస్‌ ట్విట్టర్​లో.. అరటిపండ్లపై చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. జులై 22న ఓ హోటల్లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకుని తమ వస్తువులు రెండు అరటి పండ్ల ధరతో పోల్చితే ఎంత తక్కువో...అంతే ధరకు ఎన్ని వస్తువులు వస్తాయో.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే వ్యాపార అస్త్రంగా మలిచేశాయి.

banana
హోటల్ బిల్లు

'రూ. 442' ఘటనతో అంతే మొత్తంలో అమెజాన్​లో కొనగలిగే వస్తువులపై ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది.

banana
అమెజాన్

ఐసింగ్ సంస్థ... రెండు అరటి పండ్లతో తమ వస్తువును పోలుస్తూ రూ.280కే పొందండి అని వెల్లడించింది.

banana
ఐసింగ్

పాలసీ బజార్​.కామ్ ఓ అడుగు ముందుకేసి రెండు అరటి పండ్ల ఖర్చుతోనే అద్భుతమైన బీమా అని ప్రచారం చేస్తోంది.

banana
పాలసీ బజార్. కామ్

రూ. 99తో పిజ్జాను కొనే బదులు రూ. 442తో ఒక పండు కొంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రచారానికి దిగింది పిజ్జా హట్.

banana
పిజ్జా హట్

రిలయన్స్ ఫ్రెష్​లోనైతే రూ. 442కు ఇన్ని పండ్లొస్తాయి అంటూ ప్రచారం చేస్తోందా కంపెనీ.

banana
రిలయన్స్

గోద్రెజ్ నేచర్ బాస్కెట్ మా అరటి పళ్లను వద్దనడానికి అవేమీ రూ. 442 కాదు కేవలం రూ. 14 మాత్రమే అంటూ ప్రచారం చేస్తోంది.

banana
గోద్రేజ్

రూ. 442కు మీకు 'ఓయో'లో ఓ గది లభ్యమవుతుందోచ్... అంటూ ఓయో రూమ్స్ ప్రచారాన్ని చేస్తోంది.

banana
ఓయో రూమ్స్

హోటల్​కు జరిమానా

'వైరల్‌గా మారిన రెండు అరటిపండ్ల వీడియో' చండీగఢ్‌ ఎక్సైజ్‌, పన్నుల శాఖ కమిషనర్‌ మణ్​దీప్‌ సింగ్‌ భర్‌ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారించిన ఆయన సంబంధిత హోటల్​కు రూ. 25వేల జరిమానా విధించారు.

ఇదీ చూడండి: 'హిజ్బుల్​' ఉగ్రవాది అహ్మద్​ తాంతరీ అరెస్ట్​

సమాజంలో జరిగే సంఘటనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడంలో వాణిజ్య వర్గాలు ముందుంటాయి. ప్రత్యేక సందర్భాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకూ ప్రచారాన్ని చేసేవి. తాజాగా ఓ అడుగు ముందుకేశాయి.

బాలీవుడ్ నటుడు రాహుల్‌ బోస్‌ ట్విట్టర్​లో.. అరటిపండ్లపై చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. జులై 22న ఓ హోటల్లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకుని తమ వస్తువులు రెండు అరటి పండ్ల ధరతో పోల్చితే ఎంత తక్కువో...అంతే ధరకు ఎన్ని వస్తువులు వస్తాయో.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే వ్యాపార అస్త్రంగా మలిచేశాయి.

banana
హోటల్ బిల్లు

'రూ. 442' ఘటనతో అంతే మొత్తంలో అమెజాన్​లో కొనగలిగే వస్తువులపై ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది.

banana
అమెజాన్

ఐసింగ్ సంస్థ... రెండు అరటి పండ్లతో తమ వస్తువును పోలుస్తూ రూ.280కే పొందండి అని వెల్లడించింది.

banana
ఐసింగ్

పాలసీ బజార్​.కామ్ ఓ అడుగు ముందుకేసి రెండు అరటి పండ్ల ఖర్చుతోనే అద్భుతమైన బీమా అని ప్రచారం చేస్తోంది.

banana
పాలసీ బజార్. కామ్

రూ. 99తో పిజ్జాను కొనే బదులు రూ. 442తో ఒక పండు కొంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రచారానికి దిగింది పిజ్జా హట్.

banana
పిజ్జా హట్

రిలయన్స్ ఫ్రెష్​లోనైతే రూ. 442కు ఇన్ని పండ్లొస్తాయి అంటూ ప్రచారం చేస్తోందా కంపెనీ.

banana
రిలయన్స్

గోద్రెజ్ నేచర్ బాస్కెట్ మా అరటి పళ్లను వద్దనడానికి అవేమీ రూ. 442 కాదు కేవలం రూ. 14 మాత్రమే అంటూ ప్రచారం చేస్తోంది.

banana
గోద్రేజ్

రూ. 442కు మీకు 'ఓయో'లో ఓ గది లభ్యమవుతుందోచ్... అంటూ ఓయో రూమ్స్ ప్రచారాన్ని చేస్తోంది.

banana
ఓయో రూమ్స్

హోటల్​కు జరిమానా

'వైరల్‌గా మారిన రెండు అరటిపండ్ల వీడియో' చండీగఢ్‌ ఎక్సైజ్‌, పన్నుల శాఖ కమిషనర్‌ మణ్​దీప్‌ సింగ్‌ భర్‌ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారించిన ఆయన సంబంధిత హోటల్​కు రూ. 25వేల జరిమానా విధించారు.

ఇదీ చూడండి: 'హిజ్బుల్​' ఉగ్రవాది అహ్మద్​ తాంతరీ అరెస్ట్​

Intro:Body:Conclusion:
Last Updated : Aug 1, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.