ETV Bharat / bharat

'చైనా హోటళ్లు, రెస్టారెంట్లను నిషేధించాలి'

author img

By

Published : Jun 18, 2020, 3:42 PM IST

Updated : Jun 18, 2020, 4:11 PM IST

చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు కేంద్ర మంత్రి రాందాస్​ అఠవాలే. సరిహద్దులో 20మంది భారత జవాన్లు చైనా పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Restaurants selling Chinese food should be banned, people should boycott Chinese food: Ramdas Athawale
'చైనా హొటళ్లు, రెస్టారెంట్లను నిషేధించాలి'

భారత సరిహద్దుల్లో చైనా హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠవాలే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు రాందాస్​.

భారత్‌- చైనా సరిహద్దులో గాల్వాన్‌ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"చైనా 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత్‌ను అవమానించే చర్యలకు దిగింది. చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని నా సూచన. చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు కూడా వాటిని మూసివేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలివ్వాలి. చైనా ఆహార ఉత్పత్తులను తినేవారు కూడా వాటిని బహిష్కరించాలని నా వినతి"

--- రాందాస్​ అఠవాలే, కేంద్ర మంత్రి.

ఇదీ చూడండి:- చైనా దాడిని వ్యతిరేకిస్తూ పట్నా వాసుల వినూత్న నిరసన

భారత సరిహద్దుల్లో చైనా హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠవాలే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు రాందాస్​.

భారత్‌- చైనా సరిహద్దులో గాల్వాన్‌ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"చైనా 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత్‌ను అవమానించే చర్యలకు దిగింది. చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని నా సూచన. చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు కూడా వాటిని మూసివేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలివ్వాలి. చైనా ఆహార ఉత్పత్తులను తినేవారు కూడా వాటిని బహిష్కరించాలని నా వినతి"

--- రాందాస్​ అఠవాలే, కేంద్ర మంత్రి.

ఇదీ చూడండి:- చైనా దాడిని వ్యతిరేకిస్తూ పట్నా వాసుల వినూత్న నిరసన

Last Updated : Jun 18, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.