ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం- అజ్ఞాతంలో ఎమ్మెల్యేలు

author img

By

Published : Mar 11, 2020, 12:27 AM IST

మధ్యప్రదేశ్ రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్​ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా సహా నేడు జరిగిన పలు కీలక పరిణామాలు రాష్ట్ర రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం తెరపైకి వచ్చింది. భాజపా, కాంగ్రెస్​ వారివారి ఎమ్మెల్యేలను అజ్ఞాతంలో ఉంచాయి.

Resort politics
మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం- అజ్ఞాతంలో ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం మొదలైంది. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా.. తమ ఎమ్మెల్యేలను అజ్ఞాత ప్రాంతాల్లో ఉంచాయి. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా చూసేందుకే ఇరు పార్టీలు రిసార్ట్​ రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి.

తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్..​ మిగిలిన 92 మందిని దాచి పెట్టింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలను రాజస్థాన్​ రాజధాని జైపూర్​కు కాంగ్రెస్​ తరలించనుంది.

కాంగ్రెస్​ భేటీ...

రాజకీయ సంక్షోభం తలెత్తిన వేళ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు వెల్లడించారు.

ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తమ మెజారిటీని నిరూపించుకుంటామని మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనను పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అటు రాజీనామా చేసి బెంగళూరులో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ నేతలు అక్కడికి వెళ్లనున్నారు.

భాజపా రాజకీయం...

మరోవైపు భాజపా తమ 107 మంది ఎమ్మెల్యేలను ఒకేచోట ఉంచాలని నిర్ణయించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలందర్ని తీసుకుని దిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ నేత గోపాల్​ భార్గవ తెలిపారు.

మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం మొదలైంది. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా.. తమ ఎమ్మెల్యేలను అజ్ఞాత ప్రాంతాల్లో ఉంచాయి. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా చూసేందుకే ఇరు పార్టీలు రిసార్ట్​ రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి.

తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్..​ మిగిలిన 92 మందిని దాచి పెట్టింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలను రాజస్థాన్​ రాజధాని జైపూర్​కు కాంగ్రెస్​ తరలించనుంది.

కాంగ్రెస్​ భేటీ...

రాజకీయ సంక్షోభం తలెత్తిన వేళ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు వెల్లడించారు.

ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తమ మెజారిటీని నిరూపించుకుంటామని మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనను పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అటు రాజీనామా చేసి బెంగళూరులో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ నేతలు అక్కడికి వెళ్లనున్నారు.

భాజపా రాజకీయం...

మరోవైపు భాజపా తమ 107 మంది ఎమ్మెల్యేలను ఒకేచోట ఉంచాలని నిర్ణయించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలందర్ని తీసుకుని దిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ నేత గోపాల్​ భార్గవ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.