ETV Bharat / bharat

ప్రముఖ మలయాళ రచయిత​కు జ్ఞాన్​పీఠ్​ - జ్ఞాన్​పీఠ్​ అవార్డు

సాహిత్య ప్రపంచంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రముఖ మలయాళ రచయిత అక్కితం అచ్యుతన్​ నంబూదిరిని జ్ఞాన్​పీఠ్ అవార్డు వరించింది. గురువారం జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆన్​లైన్​ ద్వారా పాల్గొన్నారు.

Renowned Malayalam poet Akkitham Achuthan wins Jnanpith Award
ప్రముఖ మలాయళ రచయిత అచ్యుథన్​కు జ్ఞాన్​పీఠ్​
author img

By

Published : Sep 25, 2020, 7:28 AM IST

ప్రముఖ మలయాళ రచయిత అక్కితం అచ్యుతన్​ నంబూదిరిని జ్ఞాన్​పీఠ్ అవార్డు వరించింది. సాహిత్య ప్రపంచంలో విశేష కృషి చేసినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. దేవయానంలో గురువారం జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్​ ముఖ్యమంత్రి తరఫున అచ్యుతన్​కు పురస్కారాన్ని అందజేశారు. కొవిడ్​ నిబంధనల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది.

దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం అయిన జ్ఞాన్​పీఠ్​ వరించిన వారికి రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య శిల్పాన్ని కానుకగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.

అచ్యుతన్​ ​ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. కేంద్ర, రాష్ట్ర సాహిత్య పురస్కారాలు, ఒదక్కుళల్​, ఎళుతాచ్చన్​ వంటి పురస్కారాలు దక్కాయి.

జ్ఞాన్​పీఠ్ అవార్డు అందుకున్న మలయాళ రచయితల్లో జీ శంకర కురుప్ ​మొదటి వారు. తకాజి శివశంకర పిల్లై, ఎంటీ వాసుదేవన్ నాయర్, ఎస్కే పొట్టాకద్​, ఓఎన్​వీ కురూప్​కు కూడా ఈ పురస్కారం దక్కింది.

ప్రముఖ మలయాళ రచయిత అక్కితం అచ్యుతన్​ నంబూదిరిని జ్ఞాన్​పీఠ్ అవార్డు వరించింది. సాహిత్య ప్రపంచంలో విశేష కృషి చేసినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. దేవయానంలో గురువారం జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్​ ముఖ్యమంత్రి తరఫున అచ్యుతన్​కు పురస్కారాన్ని అందజేశారు. కొవిడ్​ నిబంధనల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది.

దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం అయిన జ్ఞాన్​పీఠ్​ వరించిన వారికి రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య శిల్పాన్ని కానుకగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.

అచ్యుతన్​ ​ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. కేంద్ర, రాష్ట్ర సాహిత్య పురస్కారాలు, ఒదక్కుళల్​, ఎళుతాచ్చన్​ వంటి పురస్కారాలు దక్కాయి.

జ్ఞాన్​పీఠ్ అవార్డు అందుకున్న మలయాళ రచయితల్లో జీ శంకర కురుప్ ​మొదటి వారు. తకాజి శివశంకర పిల్లై, ఎంటీ వాసుదేవన్ నాయర్, ఎస్కే పొట్టాకద్​, ఓఎన్​వీ కురూప్​కు కూడా ఈ పురస్కారం దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.