ETV Bharat / bharat

'వారి వ్యాఖ్యలు భాజపా భావజాలానికి వ్యతిరేకం'

గాడ్సేకు అనుకూలంగా కొందరు కమలనాథులు చేసిన వ్యాఖ్యలు పార్టీ భావజాలానికి వ్యతిరేకమని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్​కుమార్ హెగ్దే, నళిన్​ కటీల్​ ప్రకటనలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనన్నారు.

author img

By

Published : May 17, 2019, 2:36 PM IST

Updated : May 17, 2019, 9:28 PM IST

అమిత్​ షా

భాజపా నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్​కుమార్ హెగ్దే, నళిన్​ కటీల్​ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించామన్నారు.

"వారి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. వారి మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. అయినా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి మాటలు భాజపా భావజాలానికి, ప్రజాజీవనానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వారిపై అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ముగ్గురి నుంచి వివరణలు తీసుకున్నాక కమిటీ పదిరోజుల్లో నివేదిక సమర్పిస్తుంది."

-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

గాడ్సే దేశభక్తుడని గురువారం మాట్లాడిన సాధ్వీ ప్రజ్ఞ... వివాదానికి కారణమయ్యారు. అనంతరం గాడ్సే విషయం తెరపైకి రావటం సంతోషంగా ఉందని అనంత్​కుమార్ హెగ్దే ట్వీట్​ చేశారు. విమర్శల నేపథ్యంలో ట్విట్టర్​ ఖాతా హ్యాక్​ అయిందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక ఎంపీ కటీల్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

భాజపా నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్​కుమార్ హెగ్దే, నళిన్​ కటీల్​ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించామన్నారు.

"వారి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. వారి మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. అయినా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి మాటలు భాజపా భావజాలానికి, ప్రజాజీవనానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వారిపై అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ముగ్గురి నుంచి వివరణలు తీసుకున్నాక కమిటీ పదిరోజుల్లో నివేదిక సమర్పిస్తుంది."

-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

గాడ్సే దేశభక్తుడని గురువారం మాట్లాడిన సాధ్వీ ప్రజ్ఞ... వివాదానికి కారణమయ్యారు. అనంతరం గాడ్సే విషయం తెరపైకి రావటం సంతోషంగా ఉందని అనంత్​కుమార్ హెగ్దే ట్వీట్​ చేశారు. విమర్శల నేపథ్యంలో ట్విట్టర్​ ఖాతా హ్యాక్​ అయిందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక ఎంపీ కటీల్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 17 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0205: El Salvador US Funding AP Clients Only 4211293
US funding to control central American migration safe
AP-APTN-0103: ARCHIVE Pei AP Clients Only 4211291
Architect who designed Louvre Pyramid dies at 102
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 17, 2019, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.