ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల వేళ ఆర్​జేడీకి గట్టి ఎదురుదెబ్బ

author img

By

Published : Sep 10, 2020, 5:21 PM IST

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్​జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు అత్యంత సన్నిహితుడు, ఆర్​జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్​ ప్రసాద్ పార్టీకి​ రాజీనామా చేశారు.

Raghuvansh Prasad Singh jolt to RJD before Bihar elections
ఎన్నికల వేళ ఆర్​జేడీకి గట్టి ఎదురుదెబ్బ

బిహార్‌ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్‌ ప్రసాద్‌ ఆర్​జేడీకి రాజీనామా చేశారు.

పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్‌.. ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు. లాలూ ప్రసాద్‌కు రాసిన ఏక వాక్య రాజీనామా లేఖలో రఘువంశ్‌ 32 ఏళ్లుగా ఆయన వెంట ఉంటున్న తాను ప్రస్తుతం మాత్రం ఉండడం లేదని వివరించారు. తాను ఆర్​జేడీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల ప్రేమను పొందానన్న రఘువంశ్‌ తనను క్షమించాలని లాలూను కోరారు.

బిహార్‌ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్‌ ప్రసాద్‌ ఆర్​జేడీకి రాజీనామా చేశారు.

పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్‌.. ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు. లాలూ ప్రసాద్‌కు రాసిన ఏక వాక్య రాజీనామా లేఖలో రఘువంశ్‌ 32 ఏళ్లుగా ఆయన వెంట ఉంటున్న తాను ప్రస్తుతం మాత్రం ఉండడం లేదని వివరించారు. తాను ఆర్​జేడీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల ప్రేమను పొందానన్న రఘువంశ్‌ తనను క్షమించాలని లాలూను కోరారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.