ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు 'రైల్ రోకో'

author img

By

Published : Sep 26, 2020, 11:54 AM IST

Updated : Sep 26, 2020, 8:34 PM IST

రాజ్యసభలో ఇటీవల ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్​ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే మూడురోజుల 'రైల్​ రోకో' చేపట్టిన రైతు సంఘాలు.. దాన్ని ఈ నెల 29వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.

Punjab: Rail Roko Agitation Against Farm Bills Extended Till September 29
ఆ రాష్ట్రంలో మరో మూడు రోజలుపాటు 'రైల్ రోకో'

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్​లో చేస్తున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. 'రైల్​ రోకో'ను మరో మూడురోజులు పొడిగిస్తున్నట్టు తెలిపాయి రైతు సంఘాలు. తొలుత ప్రకటించిన ప్రకారం.. మూడురోజుల రైల్​ రోకో కార్యక్రమం ఆదివారం (సెప్టెంబర్​ 26)తో ముగియాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఈ నెల 29 వరకు రైల్​రోకో కొనసాగనుంది.

రైతుల ఆందోళనల్లో భాగంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా.. ఫిరోజ్​పుర్​ రైల్వేస్టేషన్​లో ఈ నెల 26 వరకు అన్ని రైల్వే సేవలను నిలిపివేసింది రైల్వే శాఖ.

పంజాబ్​లో రైల్ రోకో చేస్తున్న రైతులు
Punjab: Rail Roko Agitation Against Farm Bills Extended Till September 29
అర్ధనగ్న ప్రదర్శన చేపట్టిన ఆందోళనకారులు

ప్లాన్​ ఇదే..

మూడురోజుల నిరసనల్లో సెప్టెంబర్​ 27న మహిళా సంఘాలు పాల్గొననున్నాయి. మరుసటి రోజు(సెప్టెంబర్​ 28) భగత్​సింగ్​ జన్మదినం సందర్భంగా.. యువత ఆందోళన చేపడతారని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. అయితే.. ఈ ఆందోళనలో ఏ రాజకీయ పార్టీల నాయకులను అనుమతించమని.. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

Punjab: Rail Roko Agitation Against Farm Bills Extended Till September 29
రైల్వేట్రాక్​పై పడుకొని వినూత్న నిరసన

వ్యయసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. హరియాణా, ఒడిశాల్లో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకస్తూ శిరోమణి అకాళీ దళ్​ నేత, ఎంపీ హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ ఈ నెల 17న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కేంద్రం ఆమోదించిన బిల్లులివే..

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన రెండు బిల్లులు (ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌) ఈ నెల 20న రాజ్యసభలో ఆమోదం పొందాయి.

ఇదీ చదవండి: 'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్​లో చేస్తున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. 'రైల్​ రోకో'ను మరో మూడురోజులు పొడిగిస్తున్నట్టు తెలిపాయి రైతు సంఘాలు. తొలుత ప్రకటించిన ప్రకారం.. మూడురోజుల రైల్​ రోకో కార్యక్రమం ఆదివారం (సెప్టెంబర్​ 26)తో ముగియాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఈ నెల 29 వరకు రైల్​రోకో కొనసాగనుంది.

రైతుల ఆందోళనల్లో భాగంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా.. ఫిరోజ్​పుర్​ రైల్వేస్టేషన్​లో ఈ నెల 26 వరకు అన్ని రైల్వే సేవలను నిలిపివేసింది రైల్వే శాఖ.

పంజాబ్​లో రైల్ రోకో చేస్తున్న రైతులు
Punjab: Rail Roko Agitation Against Farm Bills Extended Till September 29
అర్ధనగ్న ప్రదర్శన చేపట్టిన ఆందోళనకారులు

ప్లాన్​ ఇదే..

మూడురోజుల నిరసనల్లో సెప్టెంబర్​ 27న మహిళా సంఘాలు పాల్గొననున్నాయి. మరుసటి రోజు(సెప్టెంబర్​ 28) భగత్​సింగ్​ జన్మదినం సందర్భంగా.. యువత ఆందోళన చేపడతారని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. అయితే.. ఈ ఆందోళనలో ఏ రాజకీయ పార్టీల నాయకులను అనుమతించమని.. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

Punjab: Rail Roko Agitation Against Farm Bills Extended Till September 29
రైల్వేట్రాక్​పై పడుకొని వినూత్న నిరసన

వ్యయసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. హరియాణా, ఒడిశాల్లో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకస్తూ శిరోమణి అకాళీ దళ్​ నేత, ఎంపీ హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ ఈ నెల 17న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కేంద్రం ఆమోదించిన బిల్లులివే..

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన రెండు బిల్లులు (ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌) ఈ నెల 20న రాజ్యసభలో ఆమోదం పొందాయి.

ఇదీ చదవండి: 'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం

Last Updated : Sep 26, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.