ETV Bharat / bharat

అబ్బురపరిచే పెయింటింగ్స్​తో మెప్పిస్తున్న పోలీస్

author img

By

Published : Feb 7, 2021, 9:22 AM IST

పోలీసు ఉద్యోగం అంటేనే నిరంతరం బిజీబిజీగా సాగుతుంది. కుటుంబంతో గడిపేందుకు కొన్నిసార్లు సమయం కూడా దొరకదు. కానీ, పంజాబ్​కు ఓ చెందిన ఓ కానిస్టేబుల్​ ఈ పాలసీకి భిన్నం. ఉద్యోగ జీవితం ప్రతిభ చూపేందుకు అడ్డురాదని నిరూపిస్తున్నారు. చిత్రకళా నైపుణ్యంతో చక్కని కళాఖండాలకు ప్రాణం పోస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇంతకీ ఆయనెవరో తెలుసా?.

Punjab police canvas art
అబ్బురపరిచే పెయింటింగ్స్​తో మెప్పిస్తోన్న పోలీస్
చిత్రకళా నైపుణ్యంతో ఔరా అనిపిస్తోన్న కానిస్టేబుల్

తన అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు పంజాబ్‌ పోలీసు శాఖకు చెందిన ఓ సీనియర్ కానిస్టేబుల్. చిత్రకళా నైపుణ్యంతో చక్కని కళాఖండాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు అశోక్ కుమార్. జలందర్‌లో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు చోటు సంపాదించింది. చండీగఢ్‌లోని ప్రముఖ సుఖ్‌నా సరస్సు ఒడ్డున కూర్చుని పెన్సిల్‌తో బొమ్మలు గీసేవాడు అశోక్. పంజాబ్ పోలీస్ విభాగంలో ఉద్యోగం వచ్చిన తర్వాతా తన అభిరుచిని పక్కన పెట్టలేదు.

"చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌పై నాకు ఆసక్తి ఉండేది. పంజాబ్ పోలీస్ శాఖలో నాకు ఉద్యోగం రావడానికి కూడా పెయింటింగే కారణం. డ్యూటీ ముగిసిన తర్వాత ఎప్పుడు సమయం దొరికినా పెన్సిల్ చేతబడతాను. నా ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. నా పై అధికారులకు నా నైపుణ్యాలు చూపించే అవకాశం కూడా దక్కింది."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

బడికెళ్లే నాటి నుంచే పెయింటింగ్స్ వేస్తున్న అశోక్‌కుమార్.. క్రమంగా అవార్డులూ గెలుచుకున్నాడు.

"బడిలో చదువుకునే సమయంలోనే పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాను. చండీగఢ్‌లోని సుఖ్‌నా సరస్సు వద్ద కూర్చుని, పెన్సిల్‌తో బొమ్మలు గీసుకునేవాణ్ని. గడిచిన రెండు మూడేళ్లలో నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా అవార్డులు రావడం మొదలైంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌, ఆసియా వరల్డ్ రికార్డ్స్‌లో మూడు సార్లు చోటు సాధించా. గిన్నిస్ బుక్‌లో నా పేరు చూసుకునేందుకు కష్టపడుతున్నా. పంజాబ్ పోలీసుల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆకాంక్షిస్తున్నా."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

ఇతరుల పెయింటింగ్‌లతో పోలిస్తే.. తన చిత్రకళ ఎందుకు విభిన్నమో వివరిస్తున్నాడు అశోక్.

"మొదట్లో మీనియేటర్ పెయింటింగ్స్‌ వేసేవాడ్ని. ఇప్పుడు చూస్తున్న పెయింటింగ్‌ల కంటే ఇది పూర్తి భిన్నమైనది. ఇప్పటివరకూ అతివలు, మనదేశ రాష్ట్రపతి, పది మంది సిక్కు గురువుల మీనియేచర్ పెయింటింగ్స్‌ రూపొందించాను."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

అశోక్ గీసిన కళాఖండాల్లో నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయి. దీనివెనకా ఓ ఆసక్తికరమైన కారణముంది.

"అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు మాత్రమే ఉండేవి. క్రమంగా ఆ కెమెరాలు, ఫొటోల గురించి మర్చిపోయాం. అందుకే తర్వాతి తరాలకు.. బ్లాక్‌ అండ్ వైట్ కెమెరాలు, టీవీల గురించి తెలియజేయాలనుకున్నాను. అప్పట్లో జీవితం కూడా బ్లాక్‌ అండ్ వైట్‌గానే ఉండేది. రంగులు కొనగలిగేంత డబ్బు నా వద్ద ఉండేది కాదు. అందుకే పెన్సిళ్లతోనే నా కళకు మెరుగులు దిద్దాలని నిర్ణయించుకున్నా."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

గురునానక్ దేవ్‌జీ 550వ జయంతి సందర్భంగా.. అశోక్ ఓ చిత్రపటం రూపొందించాడు. ఈ అద్భుత కళాఖండానికి గానూ.. అశోక్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

"పంజాబ్ కళాకారులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్.. ఇంకా ఎంతోమంది నన్ను సత్కరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిత్రం గీసి, ఆయనకు బహుమతిగా ఇవ్వాలన్నది నా కల."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

విధులతో నిత్యం బిజీగా గడుపుతూనే.. తన కళ ద్వారా ప్రత్యేక గుర్తింపూ, హోదా తెచ్చుకున్నాడు అశోక్‌కుమార్. ఇప్పటికీ తాను సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పుకొస్తున్నాడు. పెయింటింగ్స్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు.

ఇదీ చదవండి:గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ

చిత్రకళా నైపుణ్యంతో ఔరా అనిపిస్తోన్న కానిస్టేబుల్

తన అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు పంజాబ్‌ పోలీసు శాఖకు చెందిన ఓ సీనియర్ కానిస్టేబుల్. చిత్రకళా నైపుణ్యంతో చక్కని కళాఖండాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు అశోక్ కుమార్. జలందర్‌లో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు చోటు సంపాదించింది. చండీగఢ్‌లోని ప్రముఖ సుఖ్‌నా సరస్సు ఒడ్డున కూర్చుని పెన్సిల్‌తో బొమ్మలు గీసేవాడు అశోక్. పంజాబ్ పోలీస్ విభాగంలో ఉద్యోగం వచ్చిన తర్వాతా తన అభిరుచిని పక్కన పెట్టలేదు.

"చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌పై నాకు ఆసక్తి ఉండేది. పంజాబ్ పోలీస్ శాఖలో నాకు ఉద్యోగం రావడానికి కూడా పెయింటింగే కారణం. డ్యూటీ ముగిసిన తర్వాత ఎప్పుడు సమయం దొరికినా పెన్సిల్ చేతబడతాను. నా ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. నా పై అధికారులకు నా నైపుణ్యాలు చూపించే అవకాశం కూడా దక్కింది."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

బడికెళ్లే నాటి నుంచే పెయింటింగ్స్ వేస్తున్న అశోక్‌కుమార్.. క్రమంగా అవార్డులూ గెలుచుకున్నాడు.

"బడిలో చదువుకునే సమయంలోనే పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాను. చండీగఢ్‌లోని సుఖ్‌నా సరస్సు వద్ద కూర్చుని, పెన్సిల్‌తో బొమ్మలు గీసుకునేవాణ్ని. గడిచిన రెండు మూడేళ్లలో నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా అవార్డులు రావడం మొదలైంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌, ఆసియా వరల్డ్ రికార్డ్స్‌లో మూడు సార్లు చోటు సాధించా. గిన్నిస్ బుక్‌లో నా పేరు చూసుకునేందుకు కష్టపడుతున్నా. పంజాబ్ పోలీసుల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆకాంక్షిస్తున్నా."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

ఇతరుల పెయింటింగ్‌లతో పోలిస్తే.. తన చిత్రకళ ఎందుకు విభిన్నమో వివరిస్తున్నాడు అశోక్.

"మొదట్లో మీనియేటర్ పెయింటింగ్స్‌ వేసేవాడ్ని. ఇప్పుడు చూస్తున్న పెయింటింగ్‌ల కంటే ఇది పూర్తి భిన్నమైనది. ఇప్పటివరకూ అతివలు, మనదేశ రాష్ట్రపతి, పది మంది సిక్కు గురువుల మీనియేచర్ పెయింటింగ్స్‌ రూపొందించాను."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

అశోక్ గీసిన కళాఖండాల్లో నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయి. దీనివెనకా ఓ ఆసక్తికరమైన కారణముంది.

"అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు మాత్రమే ఉండేవి. క్రమంగా ఆ కెమెరాలు, ఫొటోల గురించి మర్చిపోయాం. అందుకే తర్వాతి తరాలకు.. బ్లాక్‌ అండ్ వైట్ కెమెరాలు, టీవీల గురించి తెలియజేయాలనుకున్నాను. అప్పట్లో జీవితం కూడా బ్లాక్‌ అండ్ వైట్‌గానే ఉండేది. రంగులు కొనగలిగేంత డబ్బు నా వద్ద ఉండేది కాదు. అందుకే పెన్సిళ్లతోనే నా కళకు మెరుగులు దిద్దాలని నిర్ణయించుకున్నా."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

గురునానక్ దేవ్‌జీ 550వ జయంతి సందర్భంగా.. అశోక్ ఓ చిత్రపటం రూపొందించాడు. ఈ అద్భుత కళాఖండానికి గానూ.. అశోక్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

"పంజాబ్ కళాకారులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్.. ఇంకా ఎంతోమంది నన్ను సత్కరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిత్రం గీసి, ఆయనకు బహుమతిగా ఇవ్వాలన్నది నా కల."

-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్

విధులతో నిత్యం బిజీగా గడుపుతూనే.. తన కళ ద్వారా ప్రత్యేక గుర్తింపూ, హోదా తెచ్చుకున్నాడు అశోక్‌కుమార్. ఇప్పటికీ తాను సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పుకొస్తున్నాడు. పెయింటింగ్స్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు.

ఇదీ చదవండి:గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.