ETV Bharat / bharat

'వ్యవసాయ' బిల్లులను ఆమోదించిన  పంజాబ్ అసెంబ్లీ

author img

By

Published : Oct 20, 2020, 5:26 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. భాజపా మినహా విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లులకు మద్దతిచ్చాయి.

Punjab Assembly unanimously passes Bills against farm laws
సాగు చట్ట వ్యతిరేక బిల్లులకు పంజాబ్ అసెంబ్లీ ఆమోదం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐదు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.

విపక్ష పార్టీలు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, లోక్​ ఇన్సాఫ్ పార్టీల సభ్యులు బిల్లులకు మద్దతిచ్చారు. భాజపా ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు.

వ్యవసాయ ఒప్పందంలో భాగంగా వరి, గోధుమలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.

"పార్లమెంట్​లో ఈ(సాగు) బిల్లులు చట్టాలుగా మారాయి. కానీ విధాన సభ వీటిని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. మేం తీర్మానాన్ని ఆమోదించుకొని, ఏకతాటిపైకి వచ్చాం. తీర్మాన ప్రతులను గవర్నర్​కు అందించాం, వాటిని ఆమోదించాలని అభ్యర్థించాం."

-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

బిల్లుల విషయమై మంగళవారం సాయంత్రం పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్​ను సీఎం అమరీందర్ కలిశారు. నాలుగు బిల్లులతో పాటు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం గురించి గవర్నర్​కు వివరించారు. ఆప్ ఎమ్మెల్యే హర్​పాల్ సింగ్ చీమ, శిరోమణి అకాలీదళ్ నేత శరన్​జీత్ సింగ్ ధిల్లాన్ సహా పలువురు నేతలు అమరీందర్​తో కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు.

ఇదీ చదవండి- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐదు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.

విపక్ష పార్టీలు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, లోక్​ ఇన్సాఫ్ పార్టీల సభ్యులు బిల్లులకు మద్దతిచ్చారు. భాజపా ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు.

వ్యవసాయ ఒప్పందంలో భాగంగా వరి, గోధుమలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.

"పార్లమెంట్​లో ఈ(సాగు) బిల్లులు చట్టాలుగా మారాయి. కానీ విధాన సభ వీటిని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. మేం తీర్మానాన్ని ఆమోదించుకొని, ఏకతాటిపైకి వచ్చాం. తీర్మాన ప్రతులను గవర్నర్​కు అందించాం, వాటిని ఆమోదించాలని అభ్యర్థించాం."

-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

బిల్లుల విషయమై మంగళవారం సాయంత్రం పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్​ను సీఎం అమరీందర్ కలిశారు. నాలుగు బిల్లులతో పాటు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం గురించి గవర్నర్​కు వివరించారు. ఆప్ ఎమ్మెల్యే హర్​పాల్ సింగ్ చీమ, శిరోమణి అకాలీదళ్ నేత శరన్​జీత్ సింగ్ ధిల్లాన్ సహా పలువురు నేతలు అమరీందర్​తో కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు.

ఇదీ చదవండి- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.