ETV Bharat / bharat

పుల్వామా దాడి కేసులో తండ్రి-కూతురు అరెస్ట్​

author img

By

Published : Mar 3, 2020, 5:11 PM IST

పుల్వామా దాడి కేసులో తండ్రి-కూతురును అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. మానవ బాంబు ఆదిల్​​ చివరి వీడియో వీరి ఇంట్లోనే చిత్రీకరించినట్లు గుర్తించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది.

Pulwama attack: NIA arrests father-daughter duo'
పుల్వామా దాడి కేసులో తండ్రి-కూతురు అరెస్ట్​

యావత్​ దేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). దక్షిణ కశ్మీర్,​ పుల్వామా సమీపంలోని హడ్కీపొరలో నివసిస్తున్న పీర్​ తారీఖ్​, అతడి కుమార్తె ఇంషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. దాడితో ఆ ఇద్దరికీ సంబంధం ఉన్నట్లు తెలిపింది ఎన్​ఐఏ.

2019 ఫిబ్రవరి 14న కారులో మానవబాంబుగా వచ్చి సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై దాడి చేసి.. 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నాడు ఆదిల్​ అహ్మద్ దార్​. ఆ మానవబాంబు ఆదిల్​కు పీర్​, ఇంషా సహకరించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది ఎన్ఐఏ. జైష్​-ఎ-మహ్మద్​ ఉగ్ర సంస్థ చివరిసారిగా విడుదల చేసిన ఆదిల్​ వీడియోను పీర్​ ఇంట్లో చిత్రీకరించినట్లు తేల్చింది.

వీడియో ఆధారంగా ఇంషాను, ఆమె తండ్రి పీర్​ తారీఖ్​ను అదుపులోకి తీసుకుంది ఎన్​ఐఏ.

ఇదీ చదవండి:పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు

యావత్​ దేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). దక్షిణ కశ్మీర్,​ పుల్వామా సమీపంలోని హడ్కీపొరలో నివసిస్తున్న పీర్​ తారీఖ్​, అతడి కుమార్తె ఇంషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. దాడితో ఆ ఇద్దరికీ సంబంధం ఉన్నట్లు తెలిపింది ఎన్​ఐఏ.

2019 ఫిబ్రవరి 14న కారులో మానవబాంబుగా వచ్చి సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై దాడి చేసి.. 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నాడు ఆదిల్​ అహ్మద్ దార్​. ఆ మానవబాంబు ఆదిల్​కు పీర్​, ఇంషా సహకరించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది ఎన్ఐఏ. జైష్​-ఎ-మహ్మద్​ ఉగ్ర సంస్థ చివరిసారిగా విడుదల చేసిన ఆదిల్​ వీడియోను పీర్​ ఇంట్లో చిత్రీకరించినట్లు తేల్చింది.

వీడియో ఆధారంగా ఇంషాను, ఆమె తండ్రి పీర్​ తారీఖ్​ను అదుపులోకి తీసుకుంది ఎన్​ఐఏ.

ఇదీ చదవండి:పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.