ETV Bharat / bharat

'తప్పు చేసిన పిల్లాడిలా మోదీ ప్రవర్తిస్తున్నారు'

దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : May 9, 2019, 5:25 AM IST

Updated : May 9, 2019, 8:07 AM IST

మోదీ..తప్పుచేసిన పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక
తప్పు చేసిన పిల్లాడిలా మోదీ ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక

తప్పు చేసి శిక్ష పడకుండా ఉపాధ్యాయుల నుంచి తప్పించుకునే పిల్లాడిలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దిల్లీలో జరిగిన రెండు రోడ్​షోల్లో ప్రియాంక పాల్గొన్నారు. ఉత్తర దిల్లీలో జరిగిన రోడ్​షోలో మాజీ సీఎం, పార్టీ అభ్యర్థి షీలా దీక్షిత్​ పాల్గొన్నారు. దక్షిణ దిల్లీలో కాంగ్రెస్​ అభ్యర్థి విజేందర్​ సింగ్​తో కలిసి ప్రియాంక ప్రచారం నిర్వహించారు.

"దిల్లీకి చెందిన మహిళగా, నేను మీకు (మోదీ) సవాల్​ చేస్తున్నాను. నోట్ల రద్దు, జీఎస్టీ, మహిళల భద్రత, తప్పుడు వాగ్దానాలే ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో పోటీకి రండి" - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని మోదీ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ.

"మాజీ ప్రధానులపై తప్పులను నెట్టివేయాలని మోదీ చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఉపాధ్యాయుడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పు చేసిన విద్యార్థులు చేసే పనిలా ఉంది. - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: ఒడిశా: పునరుద్ధరణ పనుల్లో పుంజుకున్న వేగం

తప్పు చేసిన పిల్లాడిలా మోదీ ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక

తప్పు చేసి శిక్ష పడకుండా ఉపాధ్యాయుల నుంచి తప్పించుకునే పిల్లాడిలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దిల్లీలో జరిగిన రెండు రోడ్​షోల్లో ప్రియాంక పాల్గొన్నారు. ఉత్తర దిల్లీలో జరిగిన రోడ్​షోలో మాజీ సీఎం, పార్టీ అభ్యర్థి షీలా దీక్షిత్​ పాల్గొన్నారు. దక్షిణ దిల్లీలో కాంగ్రెస్​ అభ్యర్థి విజేందర్​ సింగ్​తో కలిసి ప్రియాంక ప్రచారం నిర్వహించారు.

"దిల్లీకి చెందిన మహిళగా, నేను మీకు (మోదీ) సవాల్​ చేస్తున్నాను. నోట్ల రద్దు, జీఎస్టీ, మహిళల భద్రత, తప్పుడు వాగ్దానాలే ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో పోటీకి రండి" - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని మోదీ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ.

"మాజీ ప్రధానులపై తప్పులను నెట్టివేయాలని మోదీ చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఉపాధ్యాయుడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పు చేసిన విద్యార్థులు చేసే పనిలా ఉంది. - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: ఒడిశా: పునరుద్ధరణ పనుల్లో పుంజుకున్న వేగం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
Last Updated : May 9, 2019, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.